బోయిగూడ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా - కేసీఆర్
- March 23, 2022
సికింద్రాబాద్ బోయిగూడ ఘటనపై.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 11 మంది సజీవ దహనం కావడంపై విచారం చెందారు.
బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు.. 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని సీఎం కేసీఆర్ ప్రటించారు.
ప్రమాదంలో చనిపోయిన వారి పార్థివ దేహాలను.. వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని తెలిపారు. మరోవైపు.. ప్రధాని మోదీ సైతం కేంద్ర ప్రభుత్వం తరఫున.. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.
ఇక.. ఘటనా స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. బాధితులను ఆదుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా.. అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ సైతం.. ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంలో మృతులను గుర్తించామన్నారు. ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నామని.. చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!







