బోయిగూడ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా - కేసీఆర్
- March 23, 2022
సికింద్రాబాద్ బోయిగూడ ఘటనపై.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 11 మంది సజీవ దహనం కావడంపై విచారం చెందారు.
బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు.. 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని సీఎం కేసీఆర్ ప్రటించారు.
ప్రమాదంలో చనిపోయిన వారి పార్థివ దేహాలను.. వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని తెలిపారు. మరోవైపు.. ప్రధాని మోదీ సైతం కేంద్ర ప్రభుత్వం తరఫున.. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.
ఇక.. ఘటనా స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. బాధితులను ఆదుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా.. అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ సైతం.. ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంలో మృతులను గుర్తించామన్నారు. ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నామని.. చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- 1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తెచ్చిన TRAI..!
- దశాబ్దాల సమస్యకు పరిష్కారం..830 కుటుంబాలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
- పెద్ది కుటుంబానికి కేసీఆర్ భరోసా!
- గ్లోబల్ విలేజ్ సీజన్–31.. F&B వ్యాపారాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- ఇక పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు.. డిజిటల్గా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్
- విదేశీ నగరంలో షేక్ మహ్మద్ను కలిసిన అనుభవం..కొడుకు వేసవి జ్ఞాపకాన్ని పంచుకున్న UAE అధికారి
- ఎంపీ బాలశౌరి ప్రశ్నకు కేంద్రం సమాధానం
- మలేషియాలో ఘనంగా MYTA బోనాలు 2026 వేడుకలు
- ఒమన్లో మృతి చెందిన తెలంగాణ గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి తరలింపు
- లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటాం: డీజీపీ సీవీ ఆనంద్







