చిత్తూరులో పెళ్లి బస్సు ప్రమాదం.. డ్రైవర్ సహా ఏడుగురు మృతి..
- March 27, 2022
తిరుపతి: తిరుపతిలోని చంద్రగిరి మండలం బాకరాపేట ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మవరం నుంచి తిరుపతి వస్తున్న పెళ్లి బృందం బస్సు లోయలో పడింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా, సుమారు 300 అడుగుల లోయలో పడ్డ బస్సు పడిపోయింది. దీంతో ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటినా పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే రెడ్ శ్యాండిల్ టాస్క్ఫోర్స్, పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొని బస్సులో ఉన్నవారిని బయటకు తీస్తున్నారు. సుమారు 10 అంబులెన్స్లు తిరుపతి, చంద్రగిరి, బాకరాపేట, పాకాల నుంచి వచ్చాయి.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు సంఘటనా స్థలంలో 6మంది, హాస్పిటల్ లో ఒకరు మృతి చెందారు. అయితే క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు రిస్క్యూ టీం లో పాల్గొన్నారు. ఈ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. క్షతగాత్రులను తరలించేంతవరకు జిల్లా కలెక్టర్ హరినారాయన్ పర్యవేక్షించారు. అయితే మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







