తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- March 27, 2022హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వేడి తీవ్రత పెరుగుతుంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో పగలు ఎండ, వేడిగాలుల తీవ్రత అధికంగా ఉండగా.. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో రాత్రి వేళ 24 నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. రానున్న రోజుల్లో 28 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంటుందని వాతావరణ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం నిజామాబాదులో అత్యధికంగా 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్ లో 40 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 40 డిగ్రీలు, మహబూబ్ నగర్ జిల్లాలో 39 డిగ్రీలు, హైదరాబాద్ లో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్