తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

- March 27, 2022 , by Maagulf
తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వేడి తీవ్రత పెరుగుతుంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో పగలు ఎండ, వేడిగాలుల తీవ్రత అధికంగా ఉండగా.. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో రాత్రి వేళ 24 నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. రానున్న రోజుల్లో 28 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంటుందని వాతావరణ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం నిజామాబాదులో అత్యధికంగా 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్ లో 40 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 40 డిగ్రీలు, మహబూబ్ నగర్ జిల్లాలో 39 డిగ్రీలు, హైదరాబాద్ లో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com