రమదాన్.. నకిలీ ఛారిటీ ప్రాజెక్టుల పట్ల జాగ్రత్త
- March 27, 2022
కువైట్: ఫేక్ ఛారిటీ ప్రాజెక్ట్ లను ప్రోత్సహించడం ద్వారా రెస్టారెంట్లు, దుకాణాలు, వాణిజ్య సంస్థలకు అనవసర లాభాలు ఆర్జించేందుకు ఈ నెలను ఉపయోగించుకోవద్దని ఛారిటీ సొసైటీస్ అండ్ ఛారిటీ అసోసియేషన్స్ విభాగం డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ అల్-అజ్మీ హెచ్చరించారు. నిజాయితీగా ప్రజలు ఉపవాస ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు. రమదాన్ ప్రాజెక్టులు స్వచ్ఛంద సంఘాలు, సొసైటీల ద్వారా చట్టపరమైన మార్గాల ద్వారా వాటిని నియంత్రించే చట్టాలకు అనుగుణంగా మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో మాత్రమే జరుగుతాయని ఆయన చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై మంత్రిత్వ శాఖ చట్టపరమైన చర్యలను తీసుకుంటుందన్నారు. అన్ని గవర్నరేట్లలో ఇటువంటి చర్యలన్నింటినీ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుందన్నారు. ఈ సంవత్సరం తరావిహ్, కియామ్ ప్రార్థనలు గ్రాండ్ మస్జీదు యొక్క ప్రధాన ప్రార్థన మందిరంలో నిర్వహించబడవని అవ్కాఫ్ మంత్రిత్వ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. ప్రధాన ప్రార్థనా మందిరంలో నిర్వహణ పనులు జరుగుతున్నాయని, ప్రార్థనలు చిన్న ప్రార్థనా మందిరంలో జరుగుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కువైట్ మునిసిపాలిటీతో సమన్వయంతో మస్జీదుల వెలుపల టెంట్లు ఏర్పాటు చేయడానికి అనుమతించబడుతుందని, అయితే వాటిని ప్రార్థనలకు ఉపయోగించబోమన్నారు. ఉపవాసాన్ని విరమించే వారి కోసం ఈ టెంట్లు ఉంటాయని, బయటి చౌరస్తాలలో భోజనం పంపిణీ చేయబడుతుందన్నారు.
తాజా వార్తలు
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!