రమదాన్.. నకిలీ ఛారిటీ ప్రాజెక్టుల పట్ల జాగ్రత్త
- March 27, 2022
కువైట్: ఫేక్ ఛారిటీ ప్రాజెక్ట్ లను ప్రోత్సహించడం ద్వారా రెస్టారెంట్లు, దుకాణాలు, వాణిజ్య సంస్థలకు అనవసర లాభాలు ఆర్జించేందుకు ఈ నెలను ఉపయోగించుకోవద్దని ఛారిటీ సొసైటీస్ అండ్ ఛారిటీ అసోసియేషన్స్ విభాగం డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ అల్-అజ్మీ హెచ్చరించారు. నిజాయితీగా ప్రజలు ఉపవాస ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు. రమదాన్ ప్రాజెక్టులు స్వచ్ఛంద సంఘాలు, సొసైటీల ద్వారా చట్టపరమైన మార్గాల ద్వారా వాటిని నియంత్రించే చట్టాలకు అనుగుణంగా మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో మాత్రమే జరుగుతాయని ఆయన చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై మంత్రిత్వ శాఖ చట్టపరమైన చర్యలను తీసుకుంటుందన్నారు. అన్ని గవర్నరేట్లలో ఇటువంటి చర్యలన్నింటినీ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుందన్నారు. ఈ సంవత్సరం తరావిహ్, కియామ్ ప్రార్థనలు గ్రాండ్ మస్జీదు యొక్క ప్రధాన ప్రార్థన మందిరంలో నిర్వహించబడవని అవ్కాఫ్ మంత్రిత్వ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. ప్రధాన ప్రార్థనా మందిరంలో నిర్వహణ పనులు జరుగుతున్నాయని, ప్రార్థనలు చిన్న ప్రార్థనా మందిరంలో జరుగుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కువైట్ మునిసిపాలిటీతో సమన్వయంతో మస్జీదుల వెలుపల టెంట్లు ఏర్పాటు చేయడానికి అనుమతించబడుతుందని, అయితే వాటిని ప్రార్థనలకు ఉపయోగించబోమన్నారు. ఉపవాసాన్ని విరమించే వారి కోసం ఈ టెంట్లు ఉంటాయని, బయటి చౌరస్తాలలో భోజనం పంపిణీ చేయబడుతుందన్నారు.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







