రమదాన్.. నకిలీ ఛారిటీ ప్రాజెక్టుల పట్ల జాగ్రత్త
- March 27, 2022
కువైట్: ఫేక్ ఛారిటీ ప్రాజెక్ట్ లను ప్రోత్సహించడం ద్వారా రెస్టారెంట్లు, దుకాణాలు, వాణిజ్య సంస్థలకు అనవసర లాభాలు ఆర్జించేందుకు ఈ నెలను ఉపయోగించుకోవద్దని ఛారిటీ సొసైటీస్ అండ్ ఛారిటీ అసోసియేషన్స్ విభాగం డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ అల్-అజ్మీ హెచ్చరించారు. నిజాయితీగా ప్రజలు ఉపవాస ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు. రమదాన్ ప్రాజెక్టులు స్వచ్ఛంద సంఘాలు, సొసైటీల ద్వారా చట్టపరమైన మార్గాల ద్వారా వాటిని నియంత్రించే చట్టాలకు అనుగుణంగా మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో మాత్రమే జరుగుతాయని ఆయన చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై మంత్రిత్వ శాఖ చట్టపరమైన చర్యలను తీసుకుంటుందన్నారు. అన్ని గవర్నరేట్లలో ఇటువంటి చర్యలన్నింటినీ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుందన్నారు. ఈ సంవత్సరం తరావిహ్, కియామ్ ప్రార్థనలు గ్రాండ్ మస్జీదు యొక్క ప్రధాన ప్రార్థన మందిరంలో నిర్వహించబడవని అవ్కాఫ్ మంత్రిత్వ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. ప్రధాన ప్రార్థనా మందిరంలో నిర్వహణ పనులు జరుగుతున్నాయని, ప్రార్థనలు చిన్న ప్రార్థనా మందిరంలో జరుగుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కువైట్ మునిసిపాలిటీతో సమన్వయంతో మస్జీదుల వెలుపల టెంట్లు ఏర్పాటు చేయడానికి అనుమతించబడుతుందని, అయితే వాటిని ప్రార్థనలకు ఉపయోగించబోమన్నారు. ఉపవాసాన్ని విరమించే వారి కోసం ఈ టెంట్లు ఉంటాయని, బయటి చౌరస్తాలలో భోజనం పంపిణీ చేయబడుతుందన్నారు.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









