ఒమన్-ఇండియా మార్గంలో కొత్త విమాన షెడ్యూల్‌

- March 27, 2022 , by Maagulf
ఒమన్-ఇండియా మార్గంలో కొత్త విమాన షెడ్యూల్‌

మస్కట్: భారత్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో పలువురు ఆపరేటర్లు మస్కట్ నుండి భారతదేశంలోని నగరాలకు తమ విమాన షెడ్యూల్‌లను వెల్లడించారు. తక్కువ-ధర విమానయాన సంస్థ గో ఫస్ట్ ఇటీవలే మస్కట్ నుండి ముంబై, కన్నూర్‌లకు తమ విమాన షెడ్యూల్ ను ప్రకటించింది. మార్చి 27 నుండి అమలులోకి వస్తుంది. గో ఫస్ట్ వారానికి మూడుసార్లు కన్నూర్‌కు వెళ్తుంది. అయితే ఏప్రిల్ 3 నుండి విమానయాన సంస్థ వారానికి నాలుగు సార్లు ముంబైకి వెళ్తుంది. ముంబై నుండి మస్కట్‌కు విమానాలు 22:55కి బయలుదేరి 12:30 గంటలకు ఒమన్ చేరుకుంటాయి. సోమవారం, గురువారం, శనివారం, ఆదివారం. అదేవిధంగా, మస్కట్ నుండి విమానాలు సోమవారం, మంగళవారం, శుక్రవారాలు,ఆదివారం ఉదయం 1:30 గంటలకు రాజధాని నుండి బయలుదేరి 5:45 గంటలకు ముంబైకి చేరుకుంటాయి. అదేవిధంగా కన్నూర్‌కు వెళ్లే విమానాలు మస్కట్ నుండి 11:50కి బయలుదేరి, బుధ, శుక్ర, ఆదివారాల్లో 16:45కి భారతదేశానికి చేరుకుంటాయి. విమానాలు కన్నూర్ నుండి 8:30 గంటలకు బయలుదేరి, ఉదయం 10:50 గంటలకు మస్కట్ చేరుకుంటాయి. ఈ షెడ్యూల్ 23 ఏప్రిల్ 2022 నుండి రెండు నగరాలకు రోజువారీ విమానాలకు విస్తరించబడుతుంది. ఒమన్ ఎయిర్ .. భారతదేశంలోని ఎనిమిది నగరాలకు విమానాలను కూడా ప్రకటించింది. గోవా, ముంబై, ఢిల్లీ, కొచ్చి, కోజికోడ్, బెంగళూరు, హైదరాబాద్ మరియు చెన్నై నగరాలకు ఇప్పుడు బుకింగ్‌లు చేసుకోవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com