పీవీఆర్-ఐనాక్స్ విలీనం.. అధికారిక ప్రకటన విడుదల
- March 27, 2022
భారత దేశంలో మల్టీప్లేక్స్ విభాగంలో దిగ్గజ కంపెనీలు అయిన పీవీఆర్ – ఐనాక్స్ విలీనం కాబోతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి జరిగిన చర్చలు నేడు సఫలం అయ్యాయి.
దీంతో కాసేపటి క్రితం రెండు దిగ్గజ కంపెనీల ప్రతినిధులు విలీనంపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో అధికారికంగా పీవీఆర్ – ఐనాక్స్ లీజర్ సంస్థలు ఒక్కటి కాబోతున్నాయి. పీవీఆర్ – ఐనాక్స్ విలీన సంస్థలో ఐనాక్స్ లీజర్ సంస్థ మేజర్ పాట్నర్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
కాగ పీవీఆర్ – ఐనాక్స్ కంపెనీలకు దేశ వ్యాప్తంగా సుమారు 1,500 కు పైగా స్క్రీన్లు ఉన్నాయి. వీటి తర్వాత కార్నివాల్ సినిమాస్ కు 450 స్క్రీన్లు ఉన్నాయి. అలాగే సినీ పోలీస్ ఇండియా కు 417 స్క్రీన్లు ఉన్నాయి. అయితే పీవీఆర్ సంస్థ ముందుగా విలీనం గురించి సినీ పోలీస్ ఇండియా తో చర్చలు జరిపింది. సినీ పోలీసును కొనుగోలు చేయాలని పీవీఆర్ సంస్థ ప్రయత్నించింది. అయితే అనూహ్యంగా పీవీఆర్.. ఐనాక్స్ లీజర్ వైపు మొగ్గు చూపింది.
PVR and INOX announce their merger. pic.twitter.com/Z24VZogJi8
— ANI (@ANI) March 27, 2022
తాజా వార్తలు
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!
- మస్కట్లో ఈ-బైక్ ల వినియోగానికి ప్రోత్సాహం..!!
- ప్రపంచ సముద్ర రవాణాకు పెరుగుతున్న ముప్పులు..!!
- ఖతార్లో ఫాగ్ అలెర్ట్.. వాహనదారులకు హెచ్చరిక..!!
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గాయి
- కువైట్ లో ప్రమాదకరంగా డ్రైవింగ్.. ఇద్దరు అరెస్ట్..!!
- పాకిస్థాన్లో పోలీస్ ప్రధాన కార్యాలయం పై దాడి..మృతుల సంఖ్య 31కి చేరింది
- షార్జాలో వాహనదారులకు సులభతర సేవలు..కొత్త కార్యక్రమం ప్రారంభం
- నేపాల్కు 11 టన్నుల సహాయక సామగ్రిని పంపిన భారత్







