పీవీఆర్-ఐనాక్స్ విలీనం.. అధికారిక ప్రకటన విడుదల
- March 27, 2022
భారత దేశంలో మల్టీప్లేక్స్ విభాగంలో దిగ్గజ కంపెనీలు అయిన పీవీఆర్ – ఐనాక్స్ విలీనం కాబోతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి జరిగిన చర్చలు నేడు సఫలం అయ్యాయి.
దీంతో కాసేపటి క్రితం రెండు దిగ్గజ కంపెనీల ప్రతినిధులు విలీనంపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో అధికారికంగా పీవీఆర్ – ఐనాక్స్ లీజర్ సంస్థలు ఒక్కటి కాబోతున్నాయి. పీవీఆర్ – ఐనాక్స్ విలీన సంస్థలో ఐనాక్స్ లీజర్ సంస్థ మేజర్ పాట్నర్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
కాగ పీవీఆర్ – ఐనాక్స్ కంపెనీలకు దేశ వ్యాప్తంగా సుమారు 1,500 కు పైగా స్క్రీన్లు ఉన్నాయి. వీటి తర్వాత కార్నివాల్ సినిమాస్ కు 450 స్క్రీన్లు ఉన్నాయి. అలాగే సినీ పోలీస్ ఇండియా కు 417 స్క్రీన్లు ఉన్నాయి. అయితే పీవీఆర్ సంస్థ ముందుగా విలీనం గురించి సినీ పోలీస్ ఇండియా తో చర్చలు జరిపింది. సినీ పోలీసును కొనుగోలు చేయాలని పీవీఆర్ సంస్థ ప్రయత్నించింది. అయితే అనూహ్యంగా పీవీఆర్.. ఐనాక్స్ లీజర్ వైపు మొగ్గు చూపింది.
PVR and INOX announce their merger. pic.twitter.com/Z24VZogJi8
— ANI (@ANI) March 27, 2022
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









