పీవీఆర్-ఐనాక్స్ విలీనం.. అధికారిక ప్రకటన విడుదల
- March 27, 2022
భారత దేశంలో మల్టీప్లేక్స్ విభాగంలో దిగ్గజ కంపెనీలు అయిన పీవీఆర్ – ఐనాక్స్ విలీనం కాబోతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి జరిగిన చర్చలు నేడు సఫలం అయ్యాయి.
దీంతో కాసేపటి క్రితం రెండు దిగ్గజ కంపెనీల ప్రతినిధులు విలీనంపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో అధికారికంగా పీవీఆర్ – ఐనాక్స్ లీజర్ సంస్థలు ఒక్కటి కాబోతున్నాయి. పీవీఆర్ – ఐనాక్స్ విలీన సంస్థలో ఐనాక్స్ లీజర్ సంస్థ మేజర్ పాట్నర్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
కాగ పీవీఆర్ – ఐనాక్స్ కంపెనీలకు దేశ వ్యాప్తంగా సుమారు 1,500 కు పైగా స్క్రీన్లు ఉన్నాయి. వీటి తర్వాత కార్నివాల్ సినిమాస్ కు 450 స్క్రీన్లు ఉన్నాయి. అలాగే సినీ పోలీస్ ఇండియా కు 417 స్క్రీన్లు ఉన్నాయి. అయితే పీవీఆర్ సంస్థ ముందుగా విలీనం గురించి సినీ పోలీస్ ఇండియా తో చర్చలు జరిపింది. సినీ పోలీసును కొనుగోలు చేయాలని పీవీఆర్ సంస్థ ప్రయత్నించింది. అయితే అనూహ్యంగా పీవీఆర్.. ఐనాక్స్ లీజర్ వైపు మొగ్గు చూపింది.
PVR and INOX announce their merger. pic.twitter.com/Z24VZogJi8
— ANI (@ANI) March 27, 2022
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







