చారిత్రాత్మకమైన UAE-India CEPA వివరాలు వెల్లడి
- March 28, 2022
న్యూ ఢిల్లీ: భారత్, యూఏఈ మధ్య గత నెలలో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)లో భాగంగా పెట్టుబడులు, వాణిజ్య ప్రోత్సాహం, సులభతరానికి సంబంధించి సాంకేతిక మండలిని ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు ఆదివారం అంగీకరించాయి.ఐదేళ్ల కాలంలో ద్వైపాక్షిక వాణి జ్యాన్ని 10,000 కోట్ల డాలర్లకు పెంచడంతోపాటు లక్షలాదిగా ఉద్యోగాలను కల్పించడానికి వీలుగా భారత్, యూఏఈలు సీఈపీఏపై ఫిబ్రవరిలో సంతకాలు చేశాయి.కాగా పెట్టుబడులు, వాణిజ్య సహకారాన్ని ప్రోత్సహించడంతోపాటు పెట్టుబడి, వాణిజ్య సంబంధాలను పర్యవేక్షించడం,పెట్టుబడి, వాణి జ్యాన్ని విస్తరించడానికున్న అవకాశాలను గుర్తించడం వంటివి మండలి లక్ష్యాలుగా ఉన్నాయి. భారత్కు యూఏఈ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2020-21 సంవత్సరంలో భారత్, యూఏఈ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 4,330 కోట్ల డాలర్లుగా ఉంది.
2019-20లో ఇది 5,911 కోట్ల డాలర్లుగా నమోదైంది.ఇదిలా ఉంటే.. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కారణంగా భారతీయ వృత్తి నిపుణులకు మంచి అవకాశాలు లభించనున్నాయి. నర్సులు, ఇంజనీరింగ్, అకౌంటింగ్ వృత్తినిపుణులతోపాటు ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులను యూఏఈ సులభంగా అనుమతించనుంది.ఇక ఒప్పందం మేరకు 160 సర్వీసులకు గాను 100 సర్వీసులను సులభతరం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి దాకా దృష్టంతా తయారీ పైనే ఉండేది.ఇప్పుడు సర్వీసులపై కూడా ఉండనుంది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







