చారిత్రాత్మకమైన UAE-India CEPA వివరాలు వెల్లడి
- March 28, 2022
న్యూ ఢిల్లీ: భారత్, యూఏఈ మధ్య గత నెలలో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)లో భాగంగా పెట్టుబడులు, వాణిజ్య ప్రోత్సాహం, సులభతరానికి సంబంధించి సాంకేతిక మండలిని ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు ఆదివారం అంగీకరించాయి.ఐదేళ్ల కాలంలో ద్వైపాక్షిక వాణి జ్యాన్ని 10,000 కోట్ల డాలర్లకు పెంచడంతోపాటు లక్షలాదిగా ఉద్యోగాలను కల్పించడానికి వీలుగా భారత్, యూఏఈలు సీఈపీఏపై ఫిబ్రవరిలో సంతకాలు చేశాయి.కాగా పెట్టుబడులు, వాణిజ్య సహకారాన్ని ప్రోత్సహించడంతోపాటు పెట్టుబడి, వాణిజ్య సంబంధాలను పర్యవేక్షించడం,పెట్టుబడి, వాణి జ్యాన్ని విస్తరించడానికున్న అవకాశాలను గుర్తించడం వంటివి మండలి లక్ష్యాలుగా ఉన్నాయి. భారత్కు యూఏఈ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2020-21 సంవత్సరంలో భారత్, యూఏఈ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 4,330 కోట్ల డాలర్లుగా ఉంది.
2019-20లో ఇది 5,911 కోట్ల డాలర్లుగా నమోదైంది.ఇదిలా ఉంటే.. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కారణంగా భారతీయ వృత్తి నిపుణులకు మంచి అవకాశాలు లభించనున్నాయి. నర్సులు, ఇంజనీరింగ్, అకౌంటింగ్ వృత్తినిపుణులతోపాటు ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులను యూఏఈ సులభంగా అనుమతించనుంది.ఇక ఒప్పందం మేరకు 160 సర్వీసులకు గాను 100 సర్వీసులను సులభతరం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి దాకా దృష్టంతా తయారీ పైనే ఉండేది.ఇప్పుడు సర్వీసులపై కూడా ఉండనుంది.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









