సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- January 16, 2026
సౌదీ అరేబియా: ప్రపంచవ్యాప్తంగా చమురు సంపదకు పెట్టింది పేరు సౌదీ అరేబియా. అయితే ఇప్పుడు ఆ దేశం మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. సౌదీ అరేబియాలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో కళ్లు చెదిరే స్థాయిలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. సుమారు 78 లక్షల ఔన్సుల పసిడి నిక్షేపాలు కొత్తగా కనుగొన్నట్లు ఆ దేశ ప్రభుత్వ మైనింగ్ సంస్థ ‘మాడెన్’ వెల్లడించింది. ఎక్కడెక్కడ ఈ బంగారు నిధులు ఉన్నాయి? మాడెన్ సంస్థ చేపట్టిన విస్తృతమైన డ్రిల్లింగ్, అన్వేషణలో ఈ భారీ నిధులు వెలుగు చూశాయి. ముఖ్యంగా నాలుగు ప్రాంతాల్లో ఈ బంగారం ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది.. ఇక్కడే అత్యధికంగా 30 లక్షల ఔన్సుల అదనపు నిక్షేపాలు బయటపడ్డాయి.
ఈ కొత్త ప్రాంతంలో సుమారు 38 లక్షల ఔన్సుల బంగారం ఉండవచ్చని అంచనా. ఉరుక్, ఉమ్ అస్ సలాం: ఈ రెండు ప్రాంతాల నుంచి కలిపి మరో 16.7 లక్షల ఔన్సుల పసిడి లభించింది. ఈ ఆవిష్కరణలతో సౌదీ అరేబియాలోని అరేబియన్ షీల్డ్ ప్రాంతంలో ఇంకా అపారమైన ఖనిజ సంపద దాగి ఉందని స్పష్టమవుతోంది. బంగారమే కాదు.. రాగి, నికెల్ కూడా! సౌదీ అరేబియా కేవలం బంగారు నిధుల తోనే ఆగడం లేదు. జబల్ షైబాన్, జబల్ అల్ వకీల్ వంటి ప్రాంతాల్లో జరిపిన డ్రిల్లింగ్లో భారీగా రాగి, నికెల్, ప్లాటినం వంటి విలువైన లోహాలు కూడా ఉన్నట్లు గుర్తించారు.
దీనివల్ల సౌదీ అరేబియా కేవలం చమురుపైనే కాకుండా, మైనింగ్ రంగం ద్వారా కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి చేరుకోనుంది. ఈ తాజా ఆవిష్కరణలు ఆ దేశ ఆదాయాన్ని భారీగా పెంచడమే కాకుండా ప్రపంచ పసిడి మార్కెట్లో సౌదీ అరేబియా పాత్రను మరింత కీలకం చేయనున్నాయి. మాడెన్ సీఈఓ బాబ్ విల్ట్ మాట్లాడుతూ.. “ఈ ఫలితాలు మా దీర్ఘకాలిక వ్యూహానికి నిదర్శనం. సౌదీలో మరిన్ని బంగారు నిక్షేపాలను వెలికితీయడానికి మేము భారీగా పెట్టుబడులు పెడుతూనే ఉంటాం” అని ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా సౌదీలో అతి పెద్ద బంగారు గనులు దొరకడం హాట్ టాపిక్ గా మారింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









