దుబాయ్ ఎక్స్పో 2020: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తో సందడి చేసిన రణ్వీర్ సింగ్
- March 28, 2022
దుబాయ్: దుబాయ్ ఎక్స్పో 2020లో భాగంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, నటుడు రణ్వీర్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దుబాయ్ పర్యటనలో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం దుబాయ్ ఎక్స్పో 2020లో పాల్గొన్నారు. ఇండియా పెవిలియన్లోని ‘ది గ్లోబల్ రీచ్ ఆఫ్ ఇండియన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ’ గురించి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. రణ్వీర్ సింగ్తో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్భంగా మంత్రి అనురాగ్ భారతీయ సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందిన విధానంపై మాట్లాడారు. భారత్ సినిమా ఇండస్ట్రీకి పెట్టింది పేరని.. విదేశాల్లోనూ భారతీయ సినిమా సత్త చాటుతోందని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమ ద్వారా ఎంతో మందికి ఉపాధి లభించిందని మంత్రి పేర్కొన్నారు.
విదేశాల్లో ఉన్న భారతీయులు దేశ ఖ్యాతిని నలుదిక్కులా చాటి చెబుతున్నారని తెలిపారు. ఇండియా పెవిలియన్ 1.7 మిలియన్ల సందర్శకులతో భారీగా కిక్కిరిసిపోయిందని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వేడుకలు జరుగుతున్నాయని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. చిత్ర పరిశ్రమ విదేశీయులపై మంచి ప్రభావాన్ని చూపిందన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థానానికి చేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా రణ్వీర్ సింగ్ నటనా ప్రతిభను మంత్రి కొనియాడారు.
ఈ విషయమై రణవీర్ సింగ్ మాట్లాడుతూ.. భారతీయ సినిమా సరిహద్దులను చెరిపేస్తున్నాయని ఇతర దేశాల ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. దేశ విదేశాల్లో భారత సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కాగా.. ఈ భేటీకి ముందు మంత్రి అనురాగ్ ఠాకూర్, రణ్వీర్ సింగ్తో కలిసి దుబాయ్ ఎక్స్పో 2020లో ఇండియా పెవిలియన్ను సందర్శించారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







