దూసుకొస్తున్న సౌర తుఫాన్.. ఈరోజు ఏ క్షణమైన భూమిని ఢీకొట్టే ఛాన్స్..!
- March 31, 2022
భూమికి మరో ముప్పు ముంచుకొస్తోంది. సౌర తుఫాను కారణంగా భూమిపై తీవ్ర ప్రభావంతో పాటు దెబ్బతినే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు. దాదాపు 21 లక్షల కిలోమీటర్ల వేగంతో సౌర తుఫాన్ దూసుకొస్తోంది. ఈ రోజు ఏ క్షణమైనా భూమిని సౌర తుఫాన్ ఢీకొట్టే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే… మార్చి 28న సూర్యుడిపై రెండు రీజియన్లలో భారీగా విస్పోటనాలు జరిగాయి. దాంతో అక్కడ కరోనల్ మాస్ఎజెక్షన్ రిలీజైంది. దీని కారణంగా హీట్ వేవ్ భారీ స్థాయిలో వెలువడింది. ఇప్పుడు అది అంతరిక్షంలో అత్యంత వేగంతో పయనిస్తోంది. భారీ విస్పోటనం జరిగినప్పటి నుంచి మూడు రోజులుగా సూర్యుడి నుంచి తీవ్ర స్థాయిలో జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ భారీ వేడి తరంగాలు భూమిని ఢీకొట్టనున్నాయి. ఈ సోలర్ స్ట్రోమ్ భూమిపై ఉండే అయస్కాంత తరంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
21 లక్షల 85 వేల 200 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ సోలార్ తుఫాన్ వేగం.. భూమిని చేరుకునేసరికి 496 నుంచి 607 కిలోమీటర్ల వేగానికి తగ్గిపోతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ సోలార్ వేవ్ ప్రభావానికి శాటిలైట్లు గతి తప్పే అవకాశం ఉంది. శాటిలైట్లలోని కమ్యూనికేషన్ల వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. గతంలో సౌర తుఫాన్ బారిన పడి ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్కు చెందిన 40 శాటిలైట్లు పనిచేయకుండా పోయాయి. ఇప్పుడు కూడా శాటిలైట్లపై సౌర తుఫాను ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు సైంటిస్టులు.
ఈ బహుళ బహుళ భూ అయస్కాంత తుఫానులు భూమిపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. సౌర కొరోనా అంతరిక్షంలోకి నిలిచిపోవడం ద్వారా భూ అయస్కాంత తుఫానులు ఏర్పడతాయి. ఈ తుఫానులు ఎక్కువగా భూమి ఎగువ వాతావరణాన్ని ప్రభావం చూపిస్తాయి. తక్కువ-కక్ష్యలో ఉన్న వస్తువులపై తనలోకి లాగేసుకుంటాయి. నివేదికల ప్రకారం.. 'కరోనల్ మాస్ ఎజెక్షన్లు (CMEలు) కరోనల్ హోల్ హై-స్పీడ్ కలయిక ఫలితంగా భూమివైపు దూసుకొచ్చే ప్రమాదం ఉందని బ్రిటీష్ మెట్ ఆఫీస్ హెచ్చరించింది.
రాబోయే రోజుల్లో మరిన్ని సౌర తుఫానులు వచ్చే అవకాశం ఉంది. భౌగోళిక అయస్కాంత తుఫానుల పెరిగిన ఫ్రీక్వెన్సీ సౌర ప్రాంతం AR2975తో ముడిపడి ఉందని సైంటిస్టులు గుర్తించారు. శక్తివంతమైన భూ అయస్కాంత తుఫాను వేడి రేడియేషన్ కారణంగా దాని మార్గంలోని ఉపగ్రహాలను నాశనం చేయగలదు. అంతేకాదు.. సున్నితమైన పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే GPS సిస్టమ్లు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు పవర్ గ్రిడ్లకు కూడా అంతరాయం కలుగుతుంది. ఎయిర్ప్లేన్ నావిగేషన్ సిస్టమ్ల నుంచి ఆస్పత్రులు, ప్రైమరీ కేర్ సర్వీస్ల వరకు ప్రతిదీ ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- వనపర్తిలో అంబులెన్స్ ప్రారంభం..నిరుపేదలకు ఉచిత ఆటోలు పంపిణీ చేసిన సోనుసూద్
- 100 రోజులు.. స్థిరత్వాన్ని కాపాడుకున్న గల్ఫ్ దేశాలు..!!
- ప్రపంచవ్యాప్తంగా హ్యుమటేరియన్ సేవల్లో కువైట్ ఛారిటీస్..!!
- యూఏఈ లాటరీ డ్రా..ఒక్కొక్కరు Dh50,000 గెలుచుకున్నముగ్గురు విజేతలు..!!
- ఆన్లైన్ పర్యాటక మోసాలపై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- మహిళను సురక్షితంగా తరలించిన ఆర్ఓపి ఏవియేషన్..!!
- భారతీయ మహిళకు అండగా నిలిచిన ఇండియన్ ఎంబసీ..!!
- 'మీ సురక్ష–కలిసి ఉంటే కలదు సుఖం' కార్యక్రమం ఘనంగా నిర్వహణ
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం









