రమదాన్.. టాక్సీ ఓనర్లకు 12.8 మిలియన్ దిర్హామ్ల బోనస్
- April 03, 2022
యూఏఈ: దుబాయ్లోని టాక్సీ నంబర్ ప్లేట్ ఓనర్లకు మొత్తం Dh12,825,000 బోనస్గా చెల్లించనున్నారు. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ద్వారా టాక్సీ నంబర్ ప్లేట్లను ఉపయోగించే పౌరులకు బోనస్ను అందించాలని దుబాయ్ పాలకుడు హోదాలో, యుఎఇ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశించారు. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) పవిత్ర రమదాన్ మాసంలో 2,565 టాక్సీ నంబర్ ప్లేట్ల యజమానులకు బోనస్లను పంపిణీ చేయనున్నారు. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తీసుకున్న ఉదారమైన నిర్ణయానికి RTA డైరెక్టర్ జనరల్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఛైర్మన్ మత్తర్ మొహమ్మద్ అల్ టేయర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ బోనస్ పౌరుల సంక్షేమాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు మరింత సంతోషంగా రమదాన్ ను జరుపుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అల్ టేయర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!







