రమదాన్.. టాక్సీ ఓనర్లకు 12.8 మిలియన్ దిర్హామ్ల బోనస్
- April 03, 2022
యూఏఈ: దుబాయ్లోని టాక్సీ నంబర్ ప్లేట్ ఓనర్లకు మొత్తం Dh12,825,000 బోనస్గా చెల్లించనున్నారు. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ద్వారా టాక్సీ నంబర్ ప్లేట్లను ఉపయోగించే పౌరులకు బోనస్ను అందించాలని దుబాయ్ పాలకుడు హోదాలో, యుఎఇ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశించారు. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) పవిత్ర రమదాన్ మాసంలో 2,565 టాక్సీ నంబర్ ప్లేట్ల యజమానులకు బోనస్లను పంపిణీ చేయనున్నారు. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తీసుకున్న ఉదారమైన నిర్ణయానికి RTA డైరెక్టర్ జనరల్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఛైర్మన్ మత్తర్ మొహమ్మద్ అల్ టేయర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ బోనస్ పౌరుల సంక్షేమాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు మరింత సంతోషంగా రమదాన్ ను జరుపుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అల్ టేయర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









