రమదాన్.. టాక్సీ ఓనర్లకు 12.8 మిలియన్ దిర్హామ్ల బోనస్
- April 03, 2022
యూఏఈ: దుబాయ్లోని టాక్సీ నంబర్ ప్లేట్ ఓనర్లకు మొత్తం Dh12,825,000 బోనస్గా చెల్లించనున్నారు. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ద్వారా టాక్సీ నంబర్ ప్లేట్లను ఉపయోగించే పౌరులకు బోనస్ను అందించాలని దుబాయ్ పాలకుడు హోదాలో, యుఎఇ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశించారు. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) పవిత్ర రమదాన్ మాసంలో 2,565 టాక్సీ నంబర్ ప్లేట్ల యజమానులకు బోనస్లను పంపిణీ చేయనున్నారు. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తీసుకున్న ఉదారమైన నిర్ణయానికి RTA డైరెక్టర్ జనరల్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఛైర్మన్ మత్తర్ మొహమ్మద్ అల్ టేయర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ బోనస్ పౌరుల సంక్షేమాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు మరింత సంతోషంగా రమదాన్ ను జరుపుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అల్ టేయర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







