రెండున్నర నెలల్లో 475 మంది ఒమానీ కార్మికులు తొలగింపు

- April 04, 2022 , by Maagulf
రెండున్నర నెలల్లో 475 మంది ఒమానీ కార్మికులు తొలగింపు

మస్కట్: ఈ సంవత్సరం మొదటి రెండున్నర నెలల వ్యవధిలో 475 మంది ఒమానీ కార్మికులను ప్రైవేట్ రంగ సంస్థలు తొలగించాయని జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్ (GFOW)  తెలిపింది. జనవరి 1 నుండి మార్చి 16, 2022 మధ్య కాలంలో ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న 475 మంది పౌరుల ఒప్పందాలు రద్దు చేయబడ్డాయని GFOW వెల్లడించింది. వారిలో 259 మంది కాంట్రాక్టు, నిర్మాణ రంగంలో ఉండగా.. 102 మంది వాణిజ్యం, పరిశ్రమలలో పనిచేస్తున్నారు. అలాగే 94 మంది  చమురు, గ్యాస్ రంగాలలో ఉన్నారు. మిగిలిన 20 మంది విద్యుత్, నీరు,  సమాచార రంగంలో పనిచేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com