రమదాన్.. డే టైంలో ఫుడ్ కు రెస్టారెంట్లకు అనుమతి
- April 04, 2022
యూఏఈ: పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాస సమయాల్లో ఆహారం అందించడానికి దుబాయ్లోని రెస్టారెంట్లకు ముందస్తు అనుమతి అవసరం లేదు. ఈ మేరకు దుబాయ్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (డీఈటీ) సర్క్యులర్ను విడుదల చేసింది. ఫుడ్ కోర్టులలో ఉన్న రెస్టారెంట్లు, కేఫ్లు తమ వ్యాపారాన్ని యథావిధిగా నిర్వహించాలని, పగటిపూట ఆహారాన్ని అందించడానికి స్క్రీన్లు లేదా కర్టెన్లను ఉంచాల్సిన అవసరం లేదని సర్క్యూలర్ లో పేర్కొన్నారు. ఎమిరేట్లోని రెస్టారెంట్లు గత సంవత్సరం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపవాస సమయాల్లో ఆహారాన్ని అందించడానికి కర్టెన్లను ఉంచాలా లేదా అని నిర్ణయించుకోవచ్చని సర్క్యులర్ పేర్కొంది. గత సంవత్సరం, దుబాయ్లోని రెస్టారెంట్లు రమదాన్ లో పగటిపూట కర్టెన్లు, డివైడర్లు లేదా ముందుభాగాలు కనబడకుండా కస్టమర్లకు సర్వీసులు అందించేందుకు అనుమతించారు.
తాజా వార్తలు
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన









