భారత్లో భారీగా తగ్గిన కరోనా కేసులు..
- April 04, 2022
న్యూ ఢిల్లీ: భారతదేశంలో గతంలో కన్నా తక్కువ కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.లక్షల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు…ఇప్పుడు వేల సంఖ్యకు చేరుకున్నాయి.మరణాలు కూడా అదే విధంగా ఉన్నాయి. తాజాగా.. 24 గంటల్లో 913 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 13 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. ఈ మేరకు 2022, ఏప్రిల్ 04వ తేదీ సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ప్రస్తుతం దేశంలో 12,597 యాక్టివ్ కేసులున్నట్లు, దేశంలో 0.03 శాతంగా ఉన్న యాక్టివ్ కేసులున్నాయని వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 4,30,29,044 కేసులు నమోదయ్యాయని, 5,21,358 మరణాలు సంభవించాయని తెలిపింది. దేశంలో 98.76 శాతంగా కరోనా రికవరీ రేటుగా ఉందని, కరోనా నుంచి 24 గంటల్లో 1316 కోలుకున్నారని పేర్కొంది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,24,95,089 చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ









