దుబాయ్ లో తెలుగు అసోసియేషన్ వారి ఉగాది వేడుకలు
- April 04, 2022
దుబాయ్: దుబాయ్ లో ఉగాది వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.తెలుగు అస్సోసియేటిన్ వారి ఆధ్వర్యంలో షేక్ రషీద్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలలో పలువురు సినీతారలు పాల్గొని మరింత కళను చేకూర్చారు.
మామిడి తోరణాలతో, బంతి పూలతో మరియు రంగు రంగుల ముగ్గులతో అతి సుందరంగా అలంకరించిన వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ వేడుకలలో యూఏఈ లోని వివిధ ఎమిరేట్స్ అనగా..దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమా, అబుధాబి నుంచి వచ్చిన ప్రతిభావంతులైన చిన్నారులు మరియు యువ బృందాలు చేసిన సంపద్రాయ, సినీ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. యూఏఈ నుంచే కాక, భారత్ నుండి విచ్చేసిన ప్రముఖ గాయకులు సౌమ్య, సాయిచరణ్ కూడా పాల్గొని వారి గాత్రమాధుర్యములో ఆహూతులని ఓలలాడించారు.
తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించిన ఈ వేడుకలలో నటుడు శ్రీకాంత్ మరియు నటి ఈషా రెబ్బా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిని అసోసియేషన్ సభ్యులు మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సత్కరించారు.
కార్యక్రమ వ్యాఖ్యాతగా మైథిలి వ్యవహరించారు. ఈ వేడుకలకు..త్రిపుర కంస్ట్రకషన్స్, శుభోదయం గ్రూప్, మలబార్ గోల్డ్, ఫార్చ్యూన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, డాలర్ డివైన్ క్లబ్, హాక్ సెక్యూరిటీ సర్వీసెస్, అల్ కెండి గ్రూప్, మైదుబాయి, అల్ మరై, 64 టేస్ట్స్ ఆంధ్రా రెస్టారెంట్ తదితరులు స్పాన్సర్లుగా వ్యవహరించారు. అసోసియేషన్ వ్యవస్థాపక మరియు డైరెక్టర్ల బోర్డు వారి పణ్రాళిక, కల్చరల్ డైరక్టర్ మరియు వారి బృంద సభ్యులు, అసోసియేషన్ లోని మిగిలిన అన్ని విభాగాల బృంద సభ్యులందరి సహకారంతో ఈ ఉగాది వేడుకలు విజయవంతం అయ్యాయి అని అసోసియేషన్ కమిటీ తెలిపింది.
_1649053370.jpg)
_1649053339.jpg)
_1649053448.jpg)
_1649053323.jpg)
_1649053361.jpg)
_1649053311.jpg)

తాజా వార్తలు
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!









