విమానయాన రంగంలో సంచలనం...
- April 04, 2022
ఫ్రాన్స్: వంటనూనెతో నడిచిన విమానం ఆకాశంలో ఎగిరింది.అంతేకాకుండా విజయవంతంగా ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఇప్పటివరకు విమానాలలో ఇంధనంగా వైట్ పెట్రోల్నే వాడుతుండగా తాజాగా వంటనూనె వాడటం ఓ మలుపుగానే భావించాల్సి ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే..ఎయిర్ బస్ సంస్థ వారి సూపర్ జంబో విమానం ఎయిర్బస్ ఏ-380 పెట్రోల్ కాకుండా పూర్తిగా వంటనూనె ఇంధనంగా తొలి ప్రయాణాన్ని విజయవంతంగా ముగించింది.
ఎయిర్బస్ విమానం గత వారం ఫ్రాన్స్లోని టౌలూస్ బ్లాగ్నక్ విమానాశ్రయంలో వంటనూనెతో తయారుచేసిన సస్టెయినబుల్ విమాన ఇంధనాన్ని (ఎస్ఏఎఫ్) 27 టన్నుల వరకు నింపుకుని టేకాఫ్ అయింది.మూడు గంటల ప్రయాణం తర్వాత నైస్ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. 100 శాతం ఎస్ఏఎఫ్తో నింగిలోకి ఎగిరిన తొలి విమానంగా ఎయిర్బస్ ఏ-380 రికార్డులకెక్కింది. అయితే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా వంటనూనె ధరలు విపరీతంగా పెరిగిపోయిన కాలంలో వంటనూనెతో ప్రయాణం అంటే చాలా ఖరీదుగానే భావించాలి. అందులోనూ ప్రస్తుతం పెట్రోల్ కంటే వంటనూనె ధరలే అధికంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ వంటనూనెతో విమానాలు ప్రయాణిస్తే విమానయాన రంగం ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ









