అగ్నికి ఆహుతైన ఒమన్ ఎన్నారై వ్యక్తి భార్యాబిడ్డలు..!
- April 06, 2022
కేరళ: ఒమన్లో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి భార్యాబిడ్డలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.పూర్తిగా కాలిపోయిన తల్లీబిడ్డల మృతదేహాలు వారి ఇంట్లో లభించాయి. కేరళలోని పథనంతిట్ట నగరంలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది.మృతులను రిన్సా(21), ఎల్హానా(3)గా పోలీసులు గుర్తించారు. రిన్సా భర్త సాజూ మస్కట్లో ఉన్నారు.ఆయన భార్యాబిడ్డలు ఒంటరిగానే ఆ ఇంట్లో నివసించేవారు.వాళ్లిద్దరిని చివరిసారిగా సోమవారం ఉదయం చూసామని ఇరుగుపొరుగు తెలిపారు.
సోమవారం సాయంత్రం సాజూ సోదరుడి కుమార్తె.. రిన్సా ఇంటికి వెళ్లి తలుపు తట్టగా ఎంతకీ తలుపు తెరుచుకోలేదు.దీంతో.. అనుమానం వచ్చిన ఆమె తన తండ్రికి సమాచారం ఇచ్చింది. అక్కడికి వచ్చిన ఆయన తలుపులు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించగా.. మంటల్లో కాలిపోయిన తల్లీబిడ్డల మృతదేహాలు కనిపించాయి.కాగా.. ఇంట్లో కిరోసిన్ వాసన కూడా వచ్చినట్టు పోలీసులు తెలిపారు.అయితే.. ఎటువంటి సూసైడ్ నోట్ వారికి లభించలేదు.అనంతరం మృతదేహాలను రాణిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు
- UNFCCC ఫ్రేమ్వర్క్ లో చేరిన లూసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్..!!
- యువ ఆవిష్కర్తల గొప్ప ఆలోచనలు..!!
- భద్రత, రక్షణ సంబంధాలపై కువైట్, జోర్డాన్ చర్చలు..!!
- ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!
- ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!









