శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

- April 06, 2022 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు ఒక ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు.ఎమిరేట్స్ ఫ్లైట్ EK526 లో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నడకపై అనుమానం వచ్చిన అధికారులు అతడిని క్షుణ్ణంగా పరీక్షించారు.

లోదుస్తులలో ప్రత్యేకంగా కుట్టించుకున్న ప్యాకెట్లలో 478.52 గ్రాముల బంగారాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.24.82 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అధికారులు  ప్రయాణికుడిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com