కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..

- November 04, 2025 , by Maagulf
కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు.మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించి..తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్నారు. రామరాజుపాలెం, అకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంతోపాటు తదితర ప్రాంతాల్లో జగన్ పర్యటన సాగనుంది.

కృష్ణా జిల్లాలో పర్యటనలో భాగంగా.. విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట సెంటర్‌కి చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు గుమ్మడి కాయతో దిష్టి తీశారు. పూలు చలుతూ జగన్ కు ఘన స్వాగతం పలికారు.

వైఎస్ జగన్ పర్యటనలో పోలీసులు ఆంక్షలు విధించారు.కేవలం 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుతి ఇచ్చారు. అంతేకాదు.. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదని ఆంక్షలు పెట్టారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులకు నోటీసులు ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com