ఒమన్ లో 2025 నాటికి 30 కంపెనీల ప్రైవేటీకరణ
- April 12, 2022
మస్కట్: 2025 నాటికి 30కి పైగా పబ్లిక్ కంపెనీలను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (OIA) చైర్మన్ హెచ్ ఈ అబ్దుల్ సలామ్ బిన్ ముహమ్మద్ అల్ ముర్షిది తెలిపారు. అథారిటీకి దాదాపు 160 ప్రభుత్వ కంపెనీలు ఉన్నాయన్నారు. ప్రైవేటీకరణ ఒక విజయవంతమైన ప్రక్రియ అని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన ఒక రేడియో ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఐదేళ్లలో 30కి పైగా ప్రభుత్వ అనుబంధ కంపెనీలను ప్రైవేటీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ కంపెనీలను మస్కట్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ప్రైవేట్ కంపెనీలుగా మార్చితే.. ఒమానీ పౌరులు పెట్టుబడిదారులు పెట్టవచ్చన్నారు. ఎంపిక చేసిన రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ దృష్టి సారిస్తోందన్నారు. మహమ్మారి కాలంలో ఆర్థికంగా చితికిపోయిన కంపెనీలకు సహాయం చేసేందుకు అధికార యంత్రాంగం ఒక ప్రణాళికను సిద్ధం చేసిందని అల్ ముర్షిది తెలిపారు.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









