ఒమన్ లో 2025 నాటికి 30 కంపెనీల ప్రైవేటీకరణ
- April 12, 2022
మస్కట్: 2025 నాటికి 30కి పైగా పబ్లిక్ కంపెనీలను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (OIA) చైర్మన్ హెచ్ ఈ అబ్దుల్ సలామ్ బిన్ ముహమ్మద్ అల్ ముర్షిది తెలిపారు. అథారిటీకి దాదాపు 160 ప్రభుత్వ కంపెనీలు ఉన్నాయన్నారు. ప్రైవేటీకరణ ఒక విజయవంతమైన ప్రక్రియ అని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన ఒక రేడియో ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఐదేళ్లలో 30కి పైగా ప్రభుత్వ అనుబంధ కంపెనీలను ప్రైవేటీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ కంపెనీలను మస్కట్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ప్రైవేట్ కంపెనీలుగా మార్చితే.. ఒమానీ పౌరులు పెట్టుబడిదారులు పెట్టవచ్చన్నారు. ఎంపిక చేసిన రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ దృష్టి సారిస్తోందన్నారు. మహమ్మారి కాలంలో ఆర్థికంగా చితికిపోయిన కంపెనీలకు సహాయం చేసేందుకు అధికార యంత్రాంగం ఒక ప్రణాళికను సిద్ధం చేసిందని అల్ ముర్షిది తెలిపారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







