వలస కార్మికులకు అండగా వుంటోన్న ఎల్ఎంఆర్ఎని అభినందించిన భారత రాయబారి

- April 12, 2022 , by Maagulf
వలస కార్మికులకు అండగా వుంటోన్న ఎల్ఎంఆర్ఎని అభినందించిన భారత రాయబారి

మనామా: బహ్రెయిన్‌లో భారత రాయబారి పియుష్ శ్రీవాస్తవ్, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల కోసం చేపడుతున్న కార్యక్రమాల్ని అభినందించారు. పెట్టుబడిదారులు, వ్యాపరవేత్తలు, కార్మికుల కోసం ఎల్ఎంఆర్ఎ తీసుకుంటున్న చర్యల్ని కొనియాడారు. ఎల్ఎంఆర్ఎ సీఈఓ మరియు నేషనల్ కమిటీ కంబాట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ ఛైర్మన్ జమాల్ అబ్దుల్ అజీజ్ అల్ అలావి, భారత రాయబారికి స్వాగతం పలకగా, ఇరువురి మధ్యా పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతున్నట్లు ఇరువురూ వ్యాఖ్యనించారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com