బుధవారం ఫహాహీల్‌లో భారత రాయబారితో ఓపెన్ హౌస్

- April 12, 2022 , by Maagulf
బుధవారం ఫహాహీల్‌లో భారత రాయబారితో ఓపెన్ హౌస్

కువైట్: వారం వారం భారత రాయబారితో జరిగే ఓపెన్ హౌస్ కార్యక్రమం బుధవారం ఏప్రిల్ 13న బిఎల్ఎస్ ఔట్ సోర్సింగ్ కేంద్రం, అల్ అనౌద్ షాపింగ్ కాంప్లెక్స్, మెజ్జానైన్ ఫ్లోర్, మక్కా స్ట్రీట్, పహాహీల్‌లో జరుగుతుంది. భారత రాయబారి శిబి జార్జి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమం కోసం ఉదయం 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయి. కువైట్‌లోని భారత జాతీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పూర్తిగా వ్యాక్సినేషన్ పొంది వుండాలి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు. ఎవరైనా తమ సమస్యలను ప్రస్తావించదలచుకుంటే తమ పూర్తి పేరు, పాస్‌పోర్టు నెంబర్, సివిల్ ఐడీ నెంబర్ అలాగే ఫోన్ నంబర్, అడ్రస్ తదితర వివరాలతో ఇ-మెయిల్ ద్వారా ([email protected]) సమాచారం అందించాల్సి వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com