బుధవారం ఫహాహీల్లో భారత రాయబారితో ఓపెన్ హౌస్
- April 12, 2022
కువైట్: వారం వారం భారత రాయబారితో జరిగే ఓపెన్ హౌస్ కార్యక్రమం బుధవారం ఏప్రిల్ 13న బిఎల్ఎస్ ఔట్ సోర్సింగ్ కేంద్రం, అల్ అనౌద్ షాపింగ్ కాంప్లెక్స్, మెజ్జానైన్ ఫ్లోర్, మక్కా స్ట్రీట్, పహాహీల్లో జరుగుతుంది. భారత రాయబారి శిబి జార్జి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమం కోసం ఉదయం 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయి. కువైట్లోని భారత జాతీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పూర్తిగా వ్యాక్సినేషన్ పొంది వుండాలి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు. ఎవరైనా తమ సమస్యలను ప్రస్తావించదలచుకుంటే తమ పూర్తి పేరు, పాస్పోర్టు నెంబర్, సివిల్ ఐడీ నెంబర్ అలాగే ఫోన్ నంబర్, అడ్రస్ తదితర వివరాలతో ఇ-మెయిల్ ద్వారా ([email protected]) సమాచారం అందించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









