ఉపాధి కోసం అరబ్ దేశం వెళ్లింది..కానీ అలా చేయడంతో చివరికి ఉరిశిక్షకు గురయ్యింది..

- April 13, 2022 , by Maagulf
ఉపాధి కోసం అరబ్ దేశం వెళ్లింది..కానీ అలా చేయడంతో చివరికి ఉరిశిక్షకు గురయ్యింది..

యెమెన్: ఉపాధి కోసం, మంచి జీతం కోసం చాలామంది భారతీయులు ఫారిన్‌కు వెళ్లడం సహజమే. ఈ మధ్య ఇలాంటి వారి సంఖ్య మరింత పెరిగిపోయింది.అయితే అలా ఉపాధి కోసం  యెమెన్ దేశం కు వెళ్లింది ఓ మహిళ.

కానీ తనకు ఓ ఊహించని సమస్య వచ్చింది.దానివల్ల అక్కడి కోర్టు తనకు ఉరిశిక్షను ఖరారు చేసింది.ఇదంతా ఓ సినిమా కథను తలపించేలా ఉంది.

కేరళకు చెందిన నిమిషా ప్రియా అనే మహిళ నర్సు వృత్తిలో ఉంది. అయితే కొన్నాళ్ల క్రితం తను ఉపాధి కోసం అరబ్ దేశమైన యెమెన్‌కు వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి దగ్గర నర్సుగా పనిచేసింది. 2017లో ఆ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి రోజువారీగా తీసుకునే ఇంజెక్షన్లు, మాత్రలు ఓవర్‌డోస్‌ అవ్వడంతోనే మరణించాడని నిర్ధారణ అయ్యింది. దీంతో నిమిషా ప్రియా చుట్టూ ఉచ్చు బిగుసుకుంది.

నిమిషా ప్రియా వల్లే ఆ వ్యక్తి చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపించడం మొదలుపెట్టారు.తమ తండ్రి దగ్గర నిమిషా ప్రియా పాస్‌పోర్ట్ ఉందని అందుకోసమే ఆయనను చంపేసిందని ఆ వ్యక్తి వారసులు తెలిపారు. అంతే కాకుండా తమ తండ్రితో తనకు పెళ్లి అయిపోయినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్లను కూడా సృష్టించింది అని అన్నారు.అయితే పోలీసుల విచారణలో కూడా ఆధారాలన్నీ నిమిషా ప్రియాకు వ్యతిరేకంగా ఉన్నాయి.

ఆ వ్యక్తిని చంపిన కేసులో యెమెన్ కోర్టు నిమిషా ప్రియా నిందితురాలంటూ ఉరిశిక్ష విధించింది. ఇటీవల ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు నిమిషా ప్రియాకు క్షమాభిక్ష పెట్టడానికి ఒప్పుకున్నారు.కానీ బదులుగా కొంత మొత్తాన్ని ఇవ్వమని అడిగారు.నిమిషా ప్రియా కుటుంబానికి అంత స్థోమత లేకపోవడంతో ఈ కేసు ఢిల్లీ హైకోర్టుకు చేరింది.అయితే, దౌత్యపరమైన ఈ విషయంలో కలగజేసుకోబోమని హైకోర్టు ధ్రువీకరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com