ఉపాధి కోసం అరబ్ దేశం వెళ్లింది..కానీ అలా చేయడంతో చివరికి ఉరిశిక్షకు గురయ్యింది..
- April 13, 2022
యెమెన్: ఉపాధి కోసం, మంచి జీతం కోసం చాలామంది భారతీయులు ఫారిన్కు వెళ్లడం సహజమే. ఈ మధ్య ఇలాంటి వారి సంఖ్య మరింత పెరిగిపోయింది.అయితే అలా ఉపాధి కోసం యెమెన్ దేశం కు వెళ్లింది ఓ మహిళ.
కానీ తనకు ఓ ఊహించని సమస్య వచ్చింది.దానివల్ల అక్కడి కోర్టు తనకు ఉరిశిక్షను ఖరారు చేసింది.ఇదంతా ఓ సినిమా కథను తలపించేలా ఉంది.
కేరళకు చెందిన నిమిషా ప్రియా అనే మహిళ నర్సు వృత్తిలో ఉంది. అయితే కొన్నాళ్ల క్రితం తను ఉపాధి కోసం అరబ్ దేశమైన యెమెన్కు వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి దగ్గర నర్సుగా పనిచేసింది. 2017లో ఆ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి రోజువారీగా తీసుకునే ఇంజెక్షన్లు, మాత్రలు ఓవర్డోస్ అవ్వడంతోనే మరణించాడని నిర్ధారణ అయ్యింది. దీంతో నిమిషా ప్రియా చుట్టూ ఉచ్చు బిగుసుకుంది.
నిమిషా ప్రియా వల్లే ఆ వ్యక్తి చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపించడం మొదలుపెట్టారు.తమ తండ్రి దగ్గర నిమిషా ప్రియా పాస్పోర్ట్ ఉందని అందుకోసమే ఆయనను చంపేసిందని ఆ వ్యక్తి వారసులు తెలిపారు. అంతే కాకుండా తమ తండ్రితో తనకు పెళ్లి అయిపోయినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్లను కూడా సృష్టించింది అని అన్నారు.అయితే పోలీసుల విచారణలో కూడా ఆధారాలన్నీ నిమిషా ప్రియాకు వ్యతిరేకంగా ఉన్నాయి.
ఆ వ్యక్తిని చంపిన కేసులో యెమెన్ కోర్టు నిమిషా ప్రియా నిందితురాలంటూ ఉరిశిక్ష విధించింది. ఇటీవల ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు నిమిషా ప్రియాకు క్షమాభిక్ష పెట్టడానికి ఒప్పుకున్నారు.కానీ బదులుగా కొంత మొత్తాన్ని ఇవ్వమని అడిగారు.నిమిషా ప్రియా కుటుంబానికి అంత స్థోమత లేకపోవడంతో ఈ కేసు ఢిల్లీ హైకోర్టుకు చేరింది.అయితే, దౌత్యపరమైన ఈ విషయంలో కలగజేసుకోబోమని హైకోర్టు ధ్రువీకరించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు