కోవిడ్ ప్రయాణ నిబంధనలను సడలించిన యూఏఈ
- April 14, 2022
యూఏఈ: రోజువారీ కేసులు బాగా తగ్గిపోతున్నందున ప్రయాణ సంబంధిత కోవిడ్ భద్రతా నియమాలను యూఏఈ సడలించింది. టీకాలు వేయని ఎమిరాటీస్పై ప్రయాణ నిషేధం ఎత్తివేశారు. ఏప్రిల్ 16 నుండి టీకాలు వేయని పౌరులు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. అయితే వారు విమానంలో ప్రయాణానికి 48 గంటలలోపు PCR పరీక్ష చేయించుకోవాలి. దీంతోపాటు గ్రీన్ స్టేటస్ పొందడానికి అల్ హోస్న్ యాప్లో ప్రయాణ ఫారమ్లను కూడా పూర్తి చేయాలి. గతంలో ఎమిరాటీలు విదేశాలకు వెళ్లాలంటే టీకాలు, బూస్టర్ డోస్లు తప్పనిసరి. కొత్త ప్రోటోకాల్ల ప్రకారం.. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కోవిడ్-19 టీకాలు తీసుకోకపోయినా విదేశాలకు వెళ్లడానికి PCR పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఈ మినహాయింపు 12 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఉండేది.
తాజా వార్తలు
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!







