కోవిడ్ ప్రయాణ నిబంధనలను సడలించిన యూఏఈ

- April 14, 2022 , by Maagulf
కోవిడ్ ప్రయాణ నిబంధనలను సడలించిన యూఏఈ

యూఏఈ: రోజువారీ కేసులు బాగా తగ్గిపోతున్నందున ప్రయాణ సంబంధిత కోవిడ్ భద్రతా నియమాలను యూఏఈ సడలించింది. టీకాలు వేయని ఎమిరాటీస్‌పై ప్రయాణ నిషేధం ఎత్తివేశారు. ఏప్రిల్ 16 నుండి టీకాలు వేయని పౌరులు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. అయితే వారు విమానంలో ప్రయాణానికి 48 గంటలలోపు PCR పరీక్ష చేయించుకోవాలి. దీంతోపాటు గ్రీన్ స్టేటస్ పొందడానికి అల్ హోస్న్ యాప్‌లో ప్రయాణ ఫారమ్‌లను కూడా పూర్తి చేయాలి. గతంలో ఎమిరాటీలు విదేశాలకు వెళ్లాలంటే టీకాలు, బూస్టర్ డోస్‌లు తప్పనిసరి. కొత్త ప్రోటోకాల్‌ల ప్రకారం.. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కోవిడ్-19 టీకాలు తీసుకోకపోయినా విదేశాలకు వెళ్లడానికి PCR పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఈ మినహాయింపు 12 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఉండేది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com