కువైట్ ఫ్రైడే మార్కెట్లో 11,200 మందికి ఇఫ్తార్
- April 16, 2022
కువైట్: కువైట్ ఫ్రైడే మార్కెట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక టేబుల్లో 11,200 మందికి పైగా ప్రజలు ఇఫ్తార్లో ఉపవాస దీక్ష విరమించారు. ఇందుకోసం అల్రాయ్లోని ఫ్రైడే మార్కెట్ లో పొడవైన ఇఫ్తార్ టేబుల్ను ఏర్పాటు చేశారు. యువకులు, అనేక ప్రైవేట్ కంపెనీలు, రెస్టారెంట్ల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పొడవైన ఇఫ్తార్ టేబుల్ ఆలోచనను "హ్యూమానిటీ వాలంటీర్" టీమ్ లీడర్ అలీ సలాహ్ కరమ్ రూపొందించారు. ఇంతకుముందు సౌక్ ముబారకియా ఫ్రైడే మార్కెట్లో ఇలాంటి ఇఫ్తార్ను ఏర్పాటు చేశారు. అయితే ఈ సంవత్సరం 11,200 మందికి పైగా హాజరైన ఇఫ్తార్ ఇదే. ఫుడ్ బ్యాంక్, జంజామ్ మార్కెట్, "ఖధా అండ్ ఖుదౌద్" టీమ్, "కువైట్ ఇన్ అవర్ హార్ట్" టీమ్, ఫ్రైడే మార్కెట్ డిపార్ట్మెంట్, ఎమర్జెన్సీ సెంటర్, కమ్యూనిటీ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇస్లామిక్ కేర్ అసోసియేషన్ అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక రెస్టారెంట్లు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి.
తాజా వార్తలు
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!









