కువైట్ ఫ్రైడే మార్కెట్లో 11,200 మందికి ఇఫ్తార్
- April 16, 2022
కువైట్: కువైట్ ఫ్రైడే మార్కెట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక టేబుల్లో 11,200 మందికి పైగా ప్రజలు ఇఫ్తార్లో ఉపవాస దీక్ష విరమించారు. ఇందుకోసం అల్రాయ్లోని ఫ్రైడే మార్కెట్ లో పొడవైన ఇఫ్తార్ టేబుల్ను ఏర్పాటు చేశారు. యువకులు, అనేక ప్రైవేట్ కంపెనీలు, రెస్టారెంట్ల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పొడవైన ఇఫ్తార్ టేబుల్ ఆలోచనను "హ్యూమానిటీ వాలంటీర్" టీమ్ లీడర్ అలీ సలాహ్ కరమ్ రూపొందించారు. ఇంతకుముందు సౌక్ ముబారకియా ఫ్రైడే మార్కెట్లో ఇలాంటి ఇఫ్తార్ను ఏర్పాటు చేశారు. అయితే ఈ సంవత్సరం 11,200 మందికి పైగా హాజరైన ఇఫ్తార్ ఇదే. ఫుడ్ బ్యాంక్, జంజామ్ మార్కెట్, "ఖధా అండ్ ఖుదౌద్" టీమ్, "కువైట్ ఇన్ అవర్ హార్ట్" టీమ్, ఫ్రైడే మార్కెట్ డిపార్ట్మెంట్, ఎమర్జెన్సీ సెంటర్, కమ్యూనిటీ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇస్లామిక్ కేర్ అసోసియేషన్ అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక రెస్టారెంట్లు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







