కువైట్ ఫ్రైడే మార్కెట్లో 11,200 మందికి ఇఫ్తార్
- April 16, 2022
కువైట్: కువైట్ ఫ్రైడే మార్కెట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక టేబుల్లో 11,200 మందికి పైగా ప్రజలు ఇఫ్తార్లో ఉపవాస దీక్ష విరమించారు. ఇందుకోసం అల్రాయ్లోని ఫ్రైడే మార్కెట్ లో పొడవైన ఇఫ్తార్ టేబుల్ను ఏర్పాటు చేశారు. యువకులు, అనేక ప్రైవేట్ కంపెనీలు, రెస్టారెంట్ల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పొడవైన ఇఫ్తార్ టేబుల్ ఆలోచనను "హ్యూమానిటీ వాలంటీర్" టీమ్ లీడర్ అలీ సలాహ్ కరమ్ రూపొందించారు. ఇంతకుముందు సౌక్ ముబారకియా ఫ్రైడే మార్కెట్లో ఇలాంటి ఇఫ్తార్ను ఏర్పాటు చేశారు. అయితే ఈ సంవత్సరం 11,200 మందికి పైగా హాజరైన ఇఫ్తార్ ఇదే. ఫుడ్ బ్యాంక్, జంజామ్ మార్కెట్, "ఖధా అండ్ ఖుదౌద్" టీమ్, "కువైట్ ఇన్ అవర్ హార్ట్" టీమ్, ఫ్రైడే మార్కెట్ డిపార్ట్మెంట్, ఎమర్జెన్సీ సెంటర్, కమ్యూనిటీ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇస్లామిక్ కేర్ అసోసియేషన్ అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక రెస్టారెంట్లు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









