ఏప్రిల్ 17 నుండి ఈద్ వరకు పని వేళలను పెంచిన దోహా మెట్రో
- April 17, 2022
ఖతార్: రమదాన్ మాసాన్ని పరిగణనలోకి తీసుకున్న దోహా లుసైల్, మెట్రో ట్రామ్ నెట్వర్క్ పని వేళలను సవరించింది. ఖతార్ రైలు, మెట్రో, ట్రామ్, మెట్రోలింక్, మెట్రో ఎక్స్ప్రెస్ సేవలు ఏప్రిల్ 17 నుండి ఎక్కువ సమయం పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. కొత్త సమయాలు ఇలా ఉన్నాయి. శనివారం – గురువారం వరకు ఉదయం 6 నుండి అర్ధరాత్రి 1 గంటల వరకు మెట్రో సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. శుక్రవారాలు మాత్రం మధ్యాహ్నం 2 నుండి అర్ధరాత్రి 1 వరకు సర్వీసులను నడుపనున్నారు. ఈ మార్పు పరిమిత కాలానికి మాత్రమే అమలులో ఉంటుంది. ఏప్రిల్ 17 నుండి ప్రారంభమై మే 5, 2022 వరకు మెట్రో కొత్త పనివేళలు కొనసాగనున్నాయి.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









