అయోధ్య రామాలయం పై కీలక అప్డేట్...
- April 17, 2022
న్యూ ఢిల్లీ:ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ ఆలయంలో రామ్లల్లా ఎప్పుడు దర్శనం ఇస్తాడని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రామజన్మభూమి మందిర్ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ విషయంపై స్పష్టతను ఇచ్చారు.ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణ పనులు దాదాపు 30శాతం పూర్తయినట్లు తెలిపారు. 2024 సంవత్సరంలో మకర సంక్రాంతి నాడు రామమందిరాన్ని ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు.
2023 చివరి నాటికి రామజన్మభూమి ఆలయాన్ని ప్రారంభిస్తామని నేను ఇంతకు ముందు చెప్పానని, కానీ సూర్యుడు దక్షిణాయనంలో ఉండటంతో తేదీలు ఖరారు కాలేదని తెలిపారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన మకర సంక్రాంతి నాడు గొప్ప ఆలయాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. నిర్మాణ పనుల పురోగతికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. రాముడు కూర్చునేందుకు ఆరు అడుగుల పొడవైన గ్రానైట్ కుర్చీని తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం ఆగస్టులో పునాది పనులు పూర్తయిన తరువాత ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు చంపత్ రాయ్ తెలిపారు.
అదే విధంగా రాతి చెక్కడం కూడా ప్రారంభించినట్లు తెలిపారు. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఫిబ్రవరి 2020లో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కి ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పగించబడ్డాయి. 2020 ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. పదెకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం జరుగుతోంది. మూడు అంతస్తుల్లో ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







