భారత్లో గణనీయంగా పేదరికం తగ్గుముఖం: వరల్డ్ బ్యాంకు
- April 18, 2022
న్యూఢిల్లీ: భారత్లో పేదరికం గణనీయంగా తగ్గింది.మరీ ముఖ్యంగా గ్రామాల్లో పేదరికం బాగా తగ్గుముఖం పడుతున్నట్టు ప్రపంచబ్యాంకు తెలిపింది.భారత్లో పేదరికానికి సంబంధించి ప్రపంచబ్యాంకు పాలసీ రీసెర్చ్ వర్కింగ్ పేపర్ను విడుదల చేసింది.దీని ప్రకారం.. 2011-19 మధ్య కాలంలో దేశంలో తీవ్రమైన పేదరికం 12.3 శాతం తగ్గింది.2011లో 22.5 శాతంగా ఉన్న పేదరికం 2019కి 10.2 శాతం తగ్గింది. అలాగే, భారత్లో పేదరికానికి సంబంధించి అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) ఇటీవల ఓ వర్కింగ్ పేపర్ను విడుదల చేస్తూ.. భారత్ తీవ్రమైన పేదరికాన్ని నిర్మూలించిందని కొనియాడింది. ఆహార ధాన్యాలను ఉచితంగా అందజేయడం ద్వారా వినియోగంలో అసమానతలను 40 ఏళ్లలో కనిష్ఠ స్థాయికి తెచ్చినట్టు ప్రశంసించింది.
ఇప్పుడు ప్రపంచబ్యాంకు కూడా ఇదే విషయాన్ని పేర్కొంది.2011లో గ్రామాల్లో 26.3 శాతంగా ఉన్న పేదరికం 2019లో 11.6 శాతానికి తగ్గినట్టు వివరించింది.అదే సమయంలో పట్టణాల్లో 14.2 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గింది.అంటే ఈ కాలంలో పేదరికం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 14.7 శాతం, 7.9 శాతం మేర తగ్గింది. చిన్నకమతాల రైతుల వాస్తవ ఆదాయం 2013-2019 మధ్య కాలంలో ఏటా 10 శాతం పెరిగిందని, ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల ఆదాయం అదే సమయంలో 2 శాతం మాత్రమే వృద్ధి చెందినట్టు ప్రపంచబ్యాంకు తెలిపింది.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







