ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ కు దరఖాస్తులు
- April 18, 2022
న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఎస్సీతోపాటు ఇతర విద్యార్ధులకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్స్ నోటిఫికేషన్ జారీ అయింది.ఈ ప్రోగ్రామ్ క్రింది 26.50లక్షల రూపాయలను స్కాలర్ షిప్స్ గా అందజేయనున్నారు.ఎస్సీ విద్యార్ధులతోపాటు, అర్హులైన ఇతర విద్యార్ధులు కూడా స్కాలర్ షిప్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.అర్హతకు సంబంధించి తొమ్మిది, పదో తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్ధులు, ఒకటి నుండి పదో తరగతి చదువుతున్న ఇతర విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్ధులకు అందించనున్న స్కాలర్ షిప్స్ వివరాలకు సంబంధించి ఎస్సీ విద్యార్ధులకు ఏడాదికి రూ.3500 నుండి రూ.7000, ఇతర విద్యార్ధులకు ఏడాదికి 3500రూ నుండి 8000రూ చెల్లిస్తారు. దివ్యాంగ్ జన్ విద్యార్ధులకు అదనంగా మరో 10శాతం అలవెన్సు రూపంలో చెల్లిస్తారు. అర్హులైన అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://socialjustice.gov.in/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









