హాంకాంగ్లో విమానాలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా
- April 18, 2022
న్యూఢిల్లీ: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చైనాలోని హాంకాంగ్లో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసింది.ఈ నెల 19 నుంచి 23 వరకు విమానాలను నడపడం లేదని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి అధికారులు కరోనా ఆంక్షలు విధించారు.దీంతోపాటు డిమాండ్ కూడా తక్కువగా ఉన్నదని ఈ నేపథ్యంలో విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు ప్రకటించారు.
భారత్ నుంచి హాంకాంగ్ రావాలనుకునేవారు 48 గంటల ముందే పరీక్షలు చేయించుకోవాలని, నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో భారత్తో పాటు ఎనిమిది దేశాల నుంచి విమానాల రాకపోకలపై హాంకాంగ్ రెండు వారాలపాటు ఆంక్షలు విధించింది.
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రోన్ శకలాలు...తప్పిన ప్రమాదం
- రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ పై డ్రోన్ల దాడి ప్రయత్నం విఫలం: సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ
- కువైట్లో అమెరికా సైనిక విమానాలు కుప్పకూలిన ఘటన–సిబ్బంది సురక్షితం
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత: తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- దుబాయ్ విమానాల నిలిపివేతను పొడిగించిన ఎమిరేట్స్
- జూన్లో భారత్లో పర్యటించనున్న అఫ్గానిస్థాన్..
- యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం–సేవలకు అంతరాయం
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనలు









