హాంకాంగ్‌లో విమానాలు రద్దు చేసిన ఎయిర్‌ ఇండియా

- April 18, 2022 , by Maagulf
హాంకాంగ్‌లో విమానాలు రద్దు చేసిన ఎయిర్‌ ఇండియా

న్యూఢిల్లీ: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చైనాలోని హాంకాంగ్‌లో ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసింది.ఈ నెల 19 నుంచి 23 వరకు విమానాలను నడపడం లేదని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి అధికారులు కరోనా ఆంక్షలు విధించారు.దీంతోపాటు డిమాండ్‌ కూడా తక్కువగా ఉన్నదని ఈ నేపథ్యంలో విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా అధికారులు ప్రకటించారు.

భారత్‌ నుంచి హాంకాంగ్‌ రావాలనుకునేవారు 48 గంటల ముందే పరీక్షలు చేయించుకోవాలని, నెగెటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో భారత్‌తో పాటు ఎనిమిది దేశాల నుంచి విమానాల రాకపోకలపై హాంకాంగ్‌ రెండు వారాలపాటు ఆంక్షలు విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com