భారత ఆర్మీకి కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే నియామకం

- April 18, 2022 , by Maagulf
భారత ఆర్మీకి కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే నియామకం

న్యూఢిల్లీ: భారత ఆర్మీకి కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన చేసింది.ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్‌ ఎంఎం నవరణె స్థానంలో పాండే బాధ్యతలు చేపట్టన్నన్నారు. 

బిపిన్‌ రావత్‌ మరణంతో ఖాళీ అయిన సీడీఎస్‌ పోస్ట్‌ను ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ నవరణెతో భర్తీ చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే నవరణెఘీ ఏప్రిల్‌ చివరినాటికి రిటైర్‌ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ కొత్త చీఫ్‌గా.. ప్రస్తుతం వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న మనోజ్‌ పాండే నియామకం ఖరారు అయ్యింది. 

విశేషం ఏంటంటే.. ఆర్మీ చీఫ్‌గా నియమితులు కాబోతున్న మొదటి ఇంజినీర్‌ మనోజ్‌ పాండేనే కావడం. అంతకు ముందు మనోజ్‌ పాండే.. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు దేశాల కమాండింగ్‌ సెక్షన్‌లో విధులు నిర్వహించారు. 39 ఏళ్ల ఆర్మీ అనుభవం ఉన్న మనోజ్‌ పాండే.. ఏప్రిల్‌ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com