సౌదీ అరేబియా,ఒమన్ దేశాలకు విమాన సర్వీసులు పెంచిన స్పైస్జెట్
- April 19, 2022
న్యూ ఢిల్లీ: భారత్కు చెందిన లోకాస్ట్ క్యారియర్ స్పైస్జెట్ గల్ఫ్ లోని మస్కట్,రియాధ్,జెడ్డా నగరాలకు కొత్త విమాన సర్వీసులను ప్రకటించింది.కరోనా తర్వాత పరిస్థితులు అదుపులోకి రావడంతో ప్రయాణాలు పెరిగి డిమాండ్ మళ్లీ గరిష్ట స్థాయికి చేరుకుందని ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు పెంచుతున్నట్లు ఈ సందర్భంగా స్పైస్జెట్ విమానయాన సంస్థ పేర్కొంది.అహ్మదాబాద్, ముంబై, కోజికోడ్ల నుంచి ఈ కొత్త సర్వీసులను నడపునున్నట్లు తెలిపింది.అహ్మదాబాద్-మస్కట్, ముంబై-రియాధ్, కోజికోడ్-జెడ్డా మధ్య కొత్త సర్వీసులు నడవనున్నాయి.
ఈ సర్వీసులను ఈ నెల 26 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.ఎయిర్లైన్కు చెందిన BOEING-737, Q400 విమానాలను ఈ రూట్లలో నడపనున్నట్లు పేర్కొంది. ప్రయాణికుల నుంచి ఉన్న డిమాండ్తో పాటు అంతర్జాతీయ నెట్వర్క్ను బలోపేతం చేసే యోచనలో భాగంగా కొత్త సర్వీసులను తీసుకువస్తున్నట్లు ఈ సందర్భంగా స్పైస్జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శిల్పా భాటియా వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









