సౌదీ అరేబియా,ఒమన్ దేశాలకు విమాన సర్వీసులు పెంచిన స్పైస్జెట్
- April 19, 2022
న్యూ ఢిల్లీ: భారత్కు చెందిన లోకాస్ట్ క్యారియర్ స్పైస్జెట్ గల్ఫ్ లోని మస్కట్,రియాధ్,జెడ్డా నగరాలకు కొత్త విమాన సర్వీసులను ప్రకటించింది.కరోనా తర్వాత పరిస్థితులు అదుపులోకి రావడంతో ప్రయాణాలు పెరిగి డిమాండ్ మళ్లీ గరిష్ట స్థాయికి చేరుకుందని ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు పెంచుతున్నట్లు ఈ సందర్భంగా స్పైస్జెట్ విమానయాన సంస్థ పేర్కొంది.అహ్మదాబాద్, ముంబై, కోజికోడ్ల నుంచి ఈ కొత్త సర్వీసులను నడపునున్నట్లు తెలిపింది.అహ్మదాబాద్-మస్కట్, ముంబై-రియాధ్, కోజికోడ్-జెడ్డా మధ్య కొత్త సర్వీసులు నడవనున్నాయి.
ఈ సర్వీసులను ఈ నెల 26 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.ఎయిర్లైన్కు చెందిన BOEING-737, Q400 విమానాలను ఈ రూట్లలో నడపనున్నట్లు పేర్కొంది. ప్రయాణికుల నుంచి ఉన్న డిమాండ్తో పాటు అంతర్జాతీయ నెట్వర్క్ను బలోపేతం చేసే యోచనలో భాగంగా కొత్త సర్వీసులను తీసుకువస్తున్నట్లు ఈ సందర్భంగా స్పైస్జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శిల్పా భాటియా వెల్లడించారు.
తాజా వార్తలు
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!
- హౌతీ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు..!!
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా







