యూఏఈ పాఠశాలల్లో కార్యకలాపాలు పునఃప్రారంభం
- April 22, 2022
యూఏఈ: కొత్త కోవిడ్-19 భద్రతా నియమాల ప్రకారం.. యూఏఈలోని పాఠశాలలు ఈ రోజు నుండి అన్ని కార్యకలాపాలు, ఈవెంట్లను తిరిగి ప్రారంభించనున్నాయి. టీకాలు వేసిన, టీకాలు వేయని విద్యార్థులు, సిబ్బందిని అనుమతించనున్నారు. టీకాలు తీసుకోని వారికి అల్ హోస్న్ యాప్లో గ్రీన్ స్టేటస్ అమల్లో ఉంటుంది. మూసి ఉన్న ప్రదేశాలలో.. బస్సులలో ప్రయాణాల సమయంలో తప్పనిసరిగా ఫేస్ మాస్క్ లు ధరించాలి. ముందుజాగ్రత్త చర్యలకు అనుగుణంగా తల్లిదండ్రులు ఈవెంట్లు, కార్యకలాపాలకు హాజరు కావచ్చు. వసతి గృహాలలోకి ప్రవేశించాలనుకునే విశ్వవిద్యాలయ విద్యార్థులందరికీ ప్రతి నెలా ఒకసారి PCR పరీక్షను నిర్వహించాలి. కొత్త అప్డేట్ ప్రకారం.. 16 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న విద్యార్థులు, విద్యా సిబ్బంది, సిబ్బందితో పాటు విద్యా సంస్థల సందర్శకులందరికీ గ్రీన్ పాస్ ప్రోటోకాల్ను అనుసరించడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ









