యూఏఈ పాఠశాలల్లో కార్యకలాపాలు పునఃప్రారంభం
- April 22, 2022
యూఏఈ: కొత్త కోవిడ్-19 భద్రతా నియమాల ప్రకారం.. యూఏఈలోని పాఠశాలలు ఈ రోజు నుండి అన్ని కార్యకలాపాలు, ఈవెంట్లను తిరిగి ప్రారంభించనున్నాయి. టీకాలు వేసిన, టీకాలు వేయని విద్యార్థులు, సిబ్బందిని అనుమతించనున్నారు. టీకాలు తీసుకోని వారికి అల్ హోస్న్ యాప్లో గ్రీన్ స్టేటస్ అమల్లో ఉంటుంది. మూసి ఉన్న ప్రదేశాలలో.. బస్సులలో ప్రయాణాల సమయంలో తప్పనిసరిగా ఫేస్ మాస్క్ లు ధరించాలి. ముందుజాగ్రత్త చర్యలకు అనుగుణంగా తల్లిదండ్రులు ఈవెంట్లు, కార్యకలాపాలకు హాజరు కావచ్చు. వసతి గృహాలలోకి ప్రవేశించాలనుకునే విశ్వవిద్యాలయ విద్యార్థులందరికీ ప్రతి నెలా ఒకసారి PCR పరీక్షను నిర్వహించాలి. కొత్త అప్డేట్ ప్రకారం.. 16 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న విద్యార్థులు, విద్యా సిబ్బంది, సిబ్బందితో పాటు విద్యా సంస్థల సందర్శకులందరికీ గ్రీన్ పాస్ ప్రోటోకాల్ను అనుసరించడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







