శనివారాల్లోనూ పనిచేయనున్న వైద్య పరీక్షా కేంద్రాలు
- April 23, 2022
కువైట్: షువైఖ్, సభన్, జహ్రా, అలీ సబా అల్-సలేం కేంద్రాలలో ప్రవాసుల కోసం వైద్య పరీక్షా కేంద్రాలు ఏప్రిల్ 23-30వ తేదీల మధ్య ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. ఈద్ అల్-ఫితర్ సెలవుకంటే ముందు పెండింగ్లో ఉన్న ప్రవాసుల వైద్య పరీక్షలను వేగవంతం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. అంతకుముందు అత్యధిక సంఖ్యలో సందర్శకులకు వసతి కల్పించడానికి మంత్రిత్వ శాఖ వారం రోజుల కిందట ప్రవాస కార్మికుల కోసం పరీక్షా కేంద్రాలలో రెండు షిఫ్టులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మార్నింగ్ షిఫ్ట్, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ లో వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









