ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు దాడులను ఖండించిన బహ్రెయిన్

- April 23, 2022 , by Maagulf
ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు దాడులను ఖండించిన బహ్రెయిన్

మనామా: ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడులను బహ్రెయిన్ ఖండించింది. కాబూల్‌లోని ఒక పాఠశాల, విద్యా కేంద్రం.. మజార్-ఇ-షరీఫ్‌, కుందుజ్ నగరంలోని మస్జీదులను లక్ష్యంగా చేసుకొని ఇటీవల జరిగిన ఉగ్రవాద బాంబు దాడులను బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది.ఈ బాంబు దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోవడం, గాయపడటం జరిగింది.భద్రత, స్థిరత్వాన్ని అణగదొక్కే లక్ష్యంతోనే ఇటువంటి దాడులు జరిగాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. హింస, తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి అంతర్జాతీయ స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com