ఆఫ్ఘనిస్థాన్లో బాంబు దాడులను ఖండించిన బహ్రెయిన్
- April 23, 2022
మనామా: ఆఫ్ఘనిస్థాన్లో ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడులను బహ్రెయిన్ ఖండించింది. కాబూల్లోని ఒక పాఠశాల, విద్యా కేంద్రం.. మజార్-ఇ-షరీఫ్, కుందుజ్ నగరంలోని మస్జీదులను లక్ష్యంగా చేసుకొని ఇటీవల జరిగిన ఉగ్రవాద బాంబు దాడులను బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది.ఈ బాంబు దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోవడం, గాయపడటం జరిగింది.భద్రత, స్థిరత్వాన్ని అణగదొక్కే లక్ష్యంతోనే ఇటువంటి దాడులు జరిగాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. హింస, తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి అంతర్జాతీయ స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!









