‘ఆచార్య ‘ ప్రీరిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి
- April 24, 2022హైదరాబాద్: లెజండరీ హీరో మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో , అయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం’ ఆచార్య’. బ్లాక్ బర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వవహిస్తున్నారు.. ఈ మూవీ ఈ నెల 29న విడుదల కాబోతోంది. కాజల్ అగర్వాల్ , పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. ఈ సందర్భంగా శనివారం రాత్రి యూసఫ్ గూడ లోని టి ఎస్పీ ఎస్పీ 1వ బెటాలియెన్ మైదానంలో అభిమానుల కోలాహలం మధ్య ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.. మెగా స్టార్ చిరంజీవి మాట్లాడారు . ఇపుడు తెలుగు ఇండస్ట్రీ గర్వపడేలా బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు నిరూపించాయని అన్నారు. ఇందుకు దర్శకుడు రాజమౌళి ఎంతైనా అభినంద నీయుడని అన్నారు.. రాజమౌళి మన తెలుగు వాడు కావటంమన అదృష్టమన్నాడు. భారతీయ సినిమా ఒక మఠం అయితే ఆ మఠానికి పీఠాధిపతి రాజమౌళి అని పేర్కొన్నారు..
అనంతరం రాజమౌళిని శాలువాతో ఘనంగా సత్కరించారు. చరణ్ ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచాడని అన్నారు . ఈ సినిమా అందరి మన్ననలు పొందుతుందని అన్నారు. కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ, రాంచరణ్, పూజ హెగ్డే, రామజోగయ్య శాస్త్రి. నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ లక్ష్మణ్, తదితరులు మాట్లాడారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు