మదీనాలో బస్సు, ట్రక్కు ఢీ.. 8 మంది మృతి, 45 మందికి గాయాలు
- April 24, 2022
సౌదీ: సౌదీ అరేబియాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, 45 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎమిరేట్స్ విజన్ నివేదిక ప్రకారం.. యాత్రికులతో వెళ్తున్న బస్సు మదీనాలోని అల్ హిజ్రా హైవేపై ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో గాయపడిన పలువురు ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మదీనా ఇతర సహాయక సేవల నుండి 20 అంబులెన్స్ లు, అధునాతన కేర్ యూనిట్లు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మదీనా నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ యుతమాహ్ పట్టణం దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. మక్కా, మదీనా ప్రావిన్సులను కలిపే ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది.
తాజా వార్తలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!









