మదీనాలో బస్సు, ట్రక్కు ఢీ.. 8 మంది మృతి, 45 మందికి గాయాలు
- April 24, 2022
సౌదీ: సౌదీ అరేబియాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, 45 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎమిరేట్స్ విజన్ నివేదిక ప్రకారం.. యాత్రికులతో వెళ్తున్న బస్సు మదీనాలోని అల్ హిజ్రా హైవేపై ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో గాయపడిన పలువురు ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మదీనా ఇతర సహాయక సేవల నుండి 20 అంబులెన్స్ లు, అధునాతన కేర్ యూనిట్లు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మదీనా నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ యుతమాహ్ పట్టణం దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. మక్కా, మదీనా ప్రావిన్సులను కలిపే ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









