యూఏఈలో రమదాన్ తోఫా పంపిణీ
- April 24, 2022
యూఏఈ: దుబాయ్ లోని తెలుగు అసోసియేషన్ పవిత్ర రమదాన్ మాసం సంధర్భంగా 2,000 మందికి నిత్యావసర వస్తువులు వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.ఇందులో భాగంగా,రస్ అల్ ఖైమా లోని తెలుగు తరంగిణి వారితో కలిసి సంయుక్తంగా తెలుగు అసోసియేషన్ బృందం అల్ హమ్రా నందు గల లేబర్ క్యాంపులకు వెళ్లి ఏప్రిల్ 23న నిత్యావసర వస్తువులు పంపిణీ చేసారు.తెలుగు అసోసియేషన్ మరియు తెలుగు తరంగిణి దాతల సహకారంతో మరిన్ని మంచి పనులు చేసే ప్రణాళికలను ఉభయ సంస్థల అధ్యక్షులు ఉగ్గిన దినేష్ కుమార్,వక్కలగడ్డ వెంకట సురేశ్ తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని రవి వూట్నూరి,సుంకు సాయి ప్రకాష్,దిరిశాల దుర్గా ప్రసాద్,అనురాధ వొబ్బిలిశెట్టి,తెలుగు అసోసియేషన్ మరియు తెలుగు తరంగిణి బృంద సభ్యులు విజయవంతంగా నిర్వహించారు.తదుపరి గ్రాసరీ వితరణ ఏప్రిల్ 24 తేదిలో చేపట్టనున్నామని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దాతలందరికి తెలుగు అసోసియేషన్ మరియు తెలుగు తరంగిణి తరఫున ధన్యవాదాలు తెలిపారు.


తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







