యూఏఈలో రమదాన్ తోఫా పంపిణీ
- April 24, 2022
యూఏఈ: దుబాయ్ లోని తెలుగు అసోసియేషన్ పవిత్ర రమదాన్ మాసం సంధర్భంగా 2,000 మందికి నిత్యావసర వస్తువులు వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.ఇందులో భాగంగా,రస్ అల్ ఖైమా లోని తెలుగు తరంగిణి వారితో కలిసి సంయుక్తంగా తెలుగు అసోసియేషన్ బృందం అల్ హమ్రా నందు గల లేబర్ క్యాంపులకు వెళ్లి ఏప్రిల్ 23న నిత్యావసర వస్తువులు పంపిణీ చేసారు.తెలుగు అసోసియేషన్ మరియు తెలుగు తరంగిణి దాతల సహకారంతో మరిన్ని మంచి పనులు చేసే ప్రణాళికలను ఉభయ సంస్థల అధ్యక్షులు ఉగ్గిన దినేష్ కుమార్,వక్కలగడ్డ వెంకట సురేశ్ తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని రవి వూట్నూరి,సుంకు సాయి ప్రకాష్,దిరిశాల దుర్గా ప్రసాద్,అనురాధ వొబ్బిలిశెట్టి,తెలుగు అసోసియేషన్ మరియు తెలుగు తరంగిణి బృంద సభ్యులు విజయవంతంగా నిర్వహించారు.తదుపరి గ్రాసరీ వితరణ ఏప్రిల్ 24 తేదిలో చేపట్టనున్నామని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దాతలందరికి తెలుగు అసోసియేషన్ మరియు తెలుగు తరంగిణి తరఫున ధన్యవాదాలు తెలిపారు.


తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









