యూఏఈలో రమదాన్ తోఫా పంపిణీ
- April 24, 2022
యూఏఈ: దుబాయ్ లోని తెలుగు అసోసియేషన్ పవిత్ర రమదాన్ మాసం సంధర్భంగా 2,000 మందికి నిత్యావసర వస్తువులు వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.ఇందులో భాగంగా,రస్ అల్ ఖైమా లోని తెలుగు తరంగిణి వారితో కలిసి సంయుక్తంగా తెలుగు అసోసియేషన్ బృందం అల్ హమ్రా నందు గల లేబర్ క్యాంపులకు వెళ్లి ఏప్రిల్ 23న నిత్యావసర వస్తువులు పంపిణీ చేసారు.తెలుగు అసోసియేషన్ మరియు తెలుగు తరంగిణి దాతల సహకారంతో మరిన్ని మంచి పనులు చేసే ప్రణాళికలను ఉభయ సంస్థల అధ్యక్షులు ఉగ్గిన దినేష్ కుమార్,వక్కలగడ్డ వెంకట సురేశ్ తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని రవి వూట్నూరి,సుంకు సాయి ప్రకాష్,దిరిశాల దుర్గా ప్రసాద్,అనురాధ వొబ్బిలిశెట్టి,తెలుగు అసోసియేషన్ మరియు తెలుగు తరంగిణి బృంద సభ్యులు విజయవంతంగా నిర్వహించారు.తదుపరి గ్రాసరీ వితరణ ఏప్రిల్ 24 తేదిలో చేపట్టనున్నామని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దాతలందరికి తెలుగు అసోసియేషన్ మరియు తెలుగు తరంగిణి తరఫున ధన్యవాదాలు తెలిపారు.


తాజా వార్తలు
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!







