మదీనాలో బస్సు, ట్రక్కు ఢీ.. 8 మంది మృతి, 45 మందికి గాయాలు

- April 24, 2022 , by Maagulf
మదీనాలో బస్సు, ట్రక్కు ఢీ.. 8 మంది మృతి, 45 మందికి గాయాలు

సౌదీ: సౌదీ అరేబియాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, 45 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎమిరేట్స్ విజన్ నివేదిక ప్రకారం.. యాత్రికులతో వెళ్తున్న బస్సు మదీనాలోని అల్ హిజ్రా హైవేపై ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో గాయపడిన పలువురు ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మదీనా ఇతర సహాయక సేవల నుండి 20 అంబులెన్స్ లు, అధునాతన కేర్ యూనిట్లు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మదీనా నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ యుతమాహ్ పట్టణం దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. మక్కా, మదీనా ప్రావిన్సులను కలిపే ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com