మదీనాలో బస్సు, ట్రక్కు ఢీ.. 8 మంది మృతి, 45 మందికి గాయాలు
- April 24, 2022
సౌదీ: సౌదీ అరేబియాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, 45 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎమిరేట్స్ విజన్ నివేదిక ప్రకారం.. యాత్రికులతో వెళ్తున్న బస్సు మదీనాలోని అల్ హిజ్రా హైవేపై ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో గాయపడిన పలువురు ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మదీనా ఇతర సహాయక సేవల నుండి 20 అంబులెన్స్ లు, అధునాతన కేర్ యూనిట్లు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మదీనా నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ యుతమాహ్ పట్టణం దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. మక్కా, మదీనా ప్రావిన్సులను కలిపే ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







