ఉపరాష్ట్రపతిని కలిసిన తమిళనాడు సీఎం స్టాలిన్‌

- April 25, 2022 , by Maagulf
ఉపరాష్ట్రపతిని కలిసిన తమిళనాడు సీఎం స్టాలిన్‌

చెన్నై: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ఉపరాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలిశారు.

స్టాలిన్‌తో పాటు తమిళనాడు జలవనరుల శాఖ మంత్రి దురైమురుగన్, పలువురు ఎంపీలు, పార్లమెంటరీ పార్టీ నాయకులు టి.ఆర్.బాలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.వి.ఇరై అన్బు ఉపరాష్ట్రపతితో సమావేశమయ్యారు. భేటీ సందర్భంగా వెంకయ్య, స్టాలిన్‌ వివిధ అంశాలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com