యూరోపియన్ యూనియన్కు విదేశాంగ మంత్రి చురకలు
- April 27, 2022న్యూ ఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మరోసారి పశ్చిమ దేశాలపై స్వరం పెంచారు.రష్యా–యుక్రెయిన్ యుద్ధం పై భారత వైఖరిని ప్రశ్నించిన యురోపియన్ యూనియన్ సభ్యదేశాలకు దీటైన జవాబు ఇచ్చారు. ఆసియాలో నిబంధనల ఆధారంగా రూపొందించిన కార్యాచరణలు ముప్పుకు గురైనపుడు, ఇతర దేశాల నుంచి భారత్ ఎదుర్కొన్న ప్రతి సవాళ్ళను పరిష్కరించడానికి యురోపియన్ దేశాలు ముందుకు రాలేదని, అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్లోని పౌర సమాజం ముప్పుకు గురైనప్పుడు కూడా యూరోప్ దేశాలు భాద్యతగా వ్యవహరించలేదని ఎస్.జైశంకర్ నిర్మొహమాటంగా విమర్శించారు.
ప్రపంచంలో ఇంకా అనేక దేశాలు అఫ్గానిస్తాన్ తరహా సమస్యలు ఎదుర్కొంటున్నాయని మరియు ఆసియాలో ముఖ్యమైన సవాళ్లు ఉన్నాయని ఎస్.జైశంకర్ చెప్పుకొచ్చారు. ఆయా దేశాలతో ముప్పు ఎదుర్కొంటున్న సమయంలో సలహా కోరిన భారత్ కు యూరోప్ దేశాలు మొండిచేయి చూపాయని ఆయన అన్నారు. ఆ సమయంలోనూ యూరప్ తో భారత్ మరింత వాణిజ్యం చేయాలనే సలహానే యూరోప్ దేశాలు సూచించాయని, కానీ మేము మీకు కనీసం ఆ సలహా కూడా ఇవ్వడం లేదని ఎస్.జైశంకర్ చురకలంటించారు. అఫ్గానిస్తాన్ లో ప్రజాస్వామ్యం కుప్పకూలినప్పుడు ప్రపంచంలోని ఏ దేశం అక్కడ ఏమిచేసిందో తమకు చెప్పాలని ఆయన నిలదీశారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల