యూరోపియన్ యూనియన్కు విదేశాంగ మంత్రి చురకలు
- April 27, 2022
న్యూ ఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మరోసారి పశ్చిమ దేశాలపై స్వరం పెంచారు.రష్యా–యుక్రెయిన్ యుద్ధం పై భారత వైఖరిని ప్రశ్నించిన యురోపియన్ యూనియన్ సభ్యదేశాలకు దీటైన జవాబు ఇచ్చారు. ఆసియాలో నిబంధనల ఆధారంగా రూపొందించిన కార్యాచరణలు ముప్పుకు గురైనపుడు, ఇతర దేశాల నుంచి భారత్ ఎదుర్కొన్న ప్రతి సవాళ్ళను పరిష్కరించడానికి యురోపియన్ దేశాలు ముందుకు రాలేదని, అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్లోని పౌర సమాజం ముప్పుకు గురైనప్పుడు కూడా యూరోప్ దేశాలు భాద్యతగా వ్యవహరించలేదని ఎస్.జైశంకర్ నిర్మొహమాటంగా విమర్శించారు.
ప్రపంచంలో ఇంకా అనేక దేశాలు అఫ్గానిస్తాన్ తరహా సమస్యలు ఎదుర్కొంటున్నాయని మరియు ఆసియాలో ముఖ్యమైన సవాళ్లు ఉన్నాయని ఎస్.జైశంకర్ చెప్పుకొచ్చారు. ఆయా దేశాలతో ముప్పు ఎదుర్కొంటున్న సమయంలో సలహా కోరిన భారత్ కు యూరోప్ దేశాలు మొండిచేయి చూపాయని ఆయన అన్నారు. ఆ సమయంలోనూ యూరప్ తో భారత్ మరింత వాణిజ్యం చేయాలనే సలహానే యూరోప్ దేశాలు సూచించాయని, కానీ మేము మీకు కనీసం ఆ సలహా కూడా ఇవ్వడం లేదని ఎస్.జైశంకర్ చురకలంటించారు. అఫ్గానిస్తాన్ లో ప్రజాస్వామ్యం కుప్పకూలినప్పుడు ప్రపంచంలోని ఏ దేశం అక్కడ ఏమిచేసిందో తమకు చెప్పాలని ఆయన నిలదీశారు.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లో ఘోర భూకంపం..రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రత..
- రూ.1,511కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
- మెటాలో 8,000 మంది ఉద్యోగుల తొలగింపు
- FIFA వరల్డ్ కప్ 2026 ప్రసార ప్రణాళికలను ప్రకటించిన beIN స్పోర్ట్స్..!!
- రెండేళ్లలో 1.9 మిలియన్లకు చేరిన సౌదీ వాహన దిగుమతులు..!!
- అల్ అమెరాత్లో రెస్టారెంట్ అగ్నిప్రమాదం..!!
- విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్..విద్యావేత్తల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్ లో ప్రభుత్వ సేవలకు ఒకే యాప్..!!
- యూఏఈలో ఏళ్ల తరబడి చిక్కుకుపోయిన భారత మహిళ..ఎట్టకేలకు స్వదేశానికి..!!
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..









