భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో వర్షం
- April 28, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతవరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం వర్షం కురిసింది. సికింద్రాబాద్, మారేడుపల్లి , బేగంపేట్ , రాణిగంజ్, ప్యారడైస్, చిలుకలగూడ, చింతల్, శాపూర్ నగర్, గాజుల రామారాం, తో సహా పలు ప్రాంతాలలో వర్షం కురవటంతో ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.
సెక్రటేరియట్, లక్డ్డికాపుల్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవటంతో జీహెచ్ ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లో ఈరాత్రిలోగా మరికొన్నిప్రాంతాల్లో ఈదురు గాలులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
జీహెచ్ఎంసీ అధికారులు డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దింపారు. నగరంలో ఎక్కడైనా ఈదురు గాలులకు చెట్లు పడిపోయి ఇబ్బందులు ఏర్పడితే జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
ఈ రోజు రాత్రికి వికారాబాద్,సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్,మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, సిద్దిపేట, కరీంనగర్ ,భువనగిరి,నారాయణ్ పేట్ ,జనగాంలలో ఓ మోస్తరుగా వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







