ముందస్తు పీసీఆర్ పరీక్షలను రద్దు చేసిన ఇండియా

- April 30, 2022 , by Maagulf
ముందస్తు పీసీఆర్ పరీక్షలను రద్దు చేసిన ఇండియా

కువైట్: కువైట్ నుంచి వచ్చే ప్రయాణికులకు ముందస్తు పీసీఆర్ పరీక్షలను ఇండియా రద్దు చేసింది. దీంతో కువైట్ నుండి ప్రయాణీకులు పీసీఆర్ టెస్ట్ అవసరం లేకుండానే ఇండియాకు ప్రయాణించవచ్చు. తాజాగా కువైట్‌ ట్రావెల్ స్టేటస్ ను ఇండియా మార్చింది. కువైట్ నుంచి వచ్చే ప్రయాణికులు ప్రాథమిక టీకా షెడ్యూల్ పూర్తి సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేయడానికి అనుమతించింది. దీనితో కువైట్ నుండి భారతదేశానికి ప్రయాణించే ఏ ప్రయాణీకుడు ప్రయాణానికి ముందు PCR పరీక్షను చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రయాణీకుడు వారి కోవిడ్-19 టీకా సర్టిఫికేట్‌తో ఆన్‌లైన్ ఎయిర్ సువిధ పోర్టల్‌లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్‌ను మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com