వ్యక్తిగత గోప్యత హక్కు ఉల్లంఘనకు ఏడాది జైలు, అర మిలియన్ జరిమానా
- April 30, 2022
రియాద్: వ్యక్తిగత జీవితం పవిత్రతను ఉల్లంఘించవద్దని సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. సౌదీ అరేబియాలోని పౌరులు, నివాసితులు తమ గోప్యత హక్కును పరిరక్షించే షరియా, ఇతర చట్టాల ద్వారా కల్పించిన హక్కులు, హామీలను కలిగి ఉన్నారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ చెప్పింది. ఎవరైనా దానిని ఉల్లంఘించి, ఇతరులకు హాని చేయడానికి ప్రయత్నించినట్లయితే చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. వ్యక్తుల గోప్యతకు హాని కలిగించడానికి ప్రయత్నించే ఎవరికైనా ఒక సంవత్సరం జైలు శిక్ష, SR500,000 జరిమానా విధించబడుతుందని తెలిపింది. డిజిటల్ పరికరాలు, కెమెరాతో కూడిన మొబైల్ ఫోన్ల దుర్వినియోగానికి సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలను గోప్యతా ఉల్లంఘనల కిందకు వస్తాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







