యాదగిరిగుట్ట పై కొత్త పార్కింగ్ ఫీజులు..
- May 01, 2022
తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పునఃనిర్మించిన యాదాద్రి దివ్యక్షేత్రంకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించని అధికారులు.. భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నారు. అయితే సొంత వాహనాల్లో నేరుగా కొండపైకి వెళ్లాలనుకునే వారికోసం తాజాగా అనుమతి ఇచ్చిన అధికారులు... పార్కింగ్ ఫీజు మాత్రం కళ్లుచెదిరేలా నిర్ణయించారు. యాదగిరి గుట్టపై వాహనాల పార్కింగ్ పేరుతో భక్తులను నిలువు దోపిడి చేసేందుకు ఆలయ కమిటీ సిద్ధమైంది. కొండపైకి వచ్చే వాహనాలకు పార్కింగ్ ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు. నిర్దేశించిన సమయం ముగిసిన తర్వాత గంటకు అదనంగా వంద రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. ఈ ఛార్జీలు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి. వాహనాల పార్కింగ్ కోసం కొండపై ఆర్టీసీ బస్టాండ్ పక్కన స్థలాన్ని అధికారులు కేటాయించారు. ప్రోటోకాల్ ప్రకారం వీవీఐపీలు, వీఐపీలు,దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన దాతలకు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







