ఈ నెల 4 నుంచి అమెజాన్ సమ్మర్ సేల్
- May 01, 2022
ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫాం అమెజాన్ సమ్మర్ సేల్ అనౌన్స్ చేసింది. ఈ నెల 4 నుంచి సమ్మర్ సేల్ ప్రారంభం కానుంది. మూడు బ్యాంకులకు చెందిన కార్డులపై పదిశాతం డిస్కౌంట్ కూడా ప్రకటించింది. ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్, ఆర్బిఎల్ క్రెడిట్, డెబిట్ కార్డులపై పదిశాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ప్రైమ్ మెంబర్స్కు ఫ్రీ, ఫాస్ట్ డెలివరీ అందించనున్నట్లు వెల్లడించింది. అమెజాన్ ప్లాట్ఫాంపై మొదటిసారి కొనుగోల చేసేవాళ్లకు అదనంగా పదిశాతం డిస్కౌంట్ కూడా అందించనుంది. ఈ సేల్ సందర్భంగా 60కిపైగా కొత్త ఉత్పత్తుల్నిలాంఛ్ చేయనుంది.
ఫ్యాషన్ ప్రొడక్ట్స్తోపాటు హోమ్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్, బుక్స్, టాయ్స్ వంటి అనేక ప్రొడక్ట్స్పై డిస్కౌంట్లు అందించనుంది. మొబైల్స్కు సంబంధించి ప్రధానంగా రెడ్మి 10ఏ ఫోన్ రూ.8,499లకే రానుంది. అలాగే రియల్మి నర్జో 50ఏ ప్రైమ్ మొబైల్ రూ.11,499లకు, కిండిల్ రూ.6,799లకు, అమెజాన్ ఎకో షో రూ.4,499లకు, వీయూ 32 అంగుళాల ప్రీమియమ్ టీవీ రూ.11,999లకే సేల్కు అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు పలు ఉత్పత్తులపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది.
3 నుంచి ఫ్లిప్కార్ట్లో
మరోవైపు ఫ్లిప్కార్ట్ కూడా స్పెషల్ సేల్ తీసుకొస్తోంది. అమెజాన్ కంటే ఒకరోజు ముందుగా.. అంటే ఈ నెల 3 నుంచే ‘బిగ్ సేవింగ్ డేస్’ పేరుతో ఈ సేల్ ప్రారంభమవుతుంది. ఈ నెల 3 అర్ధరాత్రి 12 గంటలకు మొదలయ్యే సేల్ ఎనిమిదో తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సేల్లో ఎస్బీఐ కార్డుపై పదిశాతం డిస్కౌంట్ అందిస్తుంది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!







