భారత్ కరోనా అప్డేట్
- May 02, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది.వరుసగా ఐదో రోజు మూడు వేలకు పైగా నమోదైన కోవిడ్ కేసులు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.దేశంలో కొత్తగా 3157 పాజిటివ్ కేసులు, 26 మరణాలు నమోదు అయినట్లు రికార్డులు చెబుతున్నాయి.
ప్రస్తుతం 19వేల 500 యాక్టివ్ కేసులుండగా.. వాటిని 0.05 శాతంగా తేల్చారు. మొత్తంగా దేశంలో ఇప్పటివరకూ 4కోట్ల 30లక్షల 82వేల 345 కేసులు నమోదు కాగా, వాటిలో 5లక్షల 23వేల 869 మరణాలు నమోదయ్యాయి.
దేశంలో కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ఆదివారం ఒక్కరోజులో 2723 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా ప్రభావం నుంచి మొత్తంగా 4కోట్ల 25లక్షల 38 వేల 976 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
472 రోజులుగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 189.23 కోట్ల డోసులను అందజేశారు. ఆదివారం ఒక్కరోజు 4లక్షల 2వేల 170 డోసుల టీకాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 189కోట్ల 23లక్షల 98వేల 347 డోసుల టీకాలు అందజేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







