ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే కఠిన చర్యలు: మంత్రిత్వ శాఖ

- May 02, 2022 , by Maagulf
ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే కఠిన చర్యలు: మంత్రిత్వ శాఖ

కువైట్: ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వ అధికారులపై ఎలక్ట్రానిక్ బ్లాక్‌మెయిల్‌కు సంబంధించిన అన్ని కేసులను పర్యవేక్షించాలని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వ కార్యాలయ హోదాను కాపాడేందుకు అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. సమాచార మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్వర్ మురాద్ మాట్లాడుతూ.. మీడియా, భద్రతా అధికారుల సమన్వయంతో ఈ కేసులను పర్యవేక్షించాలని, అవసరమైన చర్య తీసుకోవడానికి సంబంధిత అధికారులకు వాటిని రిఫర్ చేయాలన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం మీడియాతో కలిసి సమన్వయంతో మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని మురాద్ వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com