ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే కఠిన చర్యలు: మంత్రిత్వ శాఖ
- May 02, 2022
కువైట్: ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వ అధికారులపై ఎలక్ట్రానిక్ బ్లాక్మెయిల్కు సంబంధించిన అన్ని కేసులను పర్యవేక్షించాలని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వ కార్యాలయ హోదాను కాపాడేందుకు అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. సమాచార మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్వర్ మురాద్ మాట్లాడుతూ.. మీడియా, భద్రతా అధికారుల సమన్వయంతో ఈ కేసులను పర్యవేక్షించాలని, అవసరమైన చర్య తీసుకోవడానికి సంబంధిత అధికారులకు వాటిని రిఫర్ చేయాలన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం మీడియాతో కలిసి సమన్వయంతో మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని మురాద్ వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







