ఫిలిప్పీన్స్లో ఘోర అగ్ని ప్రమాదం.. 8 మంది సజీవదహనం
- May 02, 2022
మనీలా: ఫిలిప్పీన్స్లో ఈరోజు ఉదయం ఘోర అగ్ని ప్రమాదంలో సంభవించింది.ఈఘటనలో 8 మంది సజీవదహనం అయ్యారు. భారీగా జనసంద్రమైన ఓ బస్తీలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో ఇండ్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. దాంట్లో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
మొత్తం 80 ఇండ్లు ధ్వంసం అయ్యాయి. క్వీజన్ సిటీలోని యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న బస్తీలో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లోని రెండవ ఫ్లోర్ నుంచి మంటలు వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఆ మంటల్ని ఆర్పేందుకు రెండు గంటల సమయం పట్టినట్లు సీనియర్ ఫైర్ ఆఫీసర్ గ్రెగ్ బిచ్యాదా తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడం వల్ల ప్రజలు తప్పించుకునేందుకు ఇబ్బందిపడ్డారు.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







